అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఓటమిపై కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి మూడు ఓవర్లతో పాటు మిడిల్ ఓవర్లలో పరుగులు చేయకపోవడం ఓటమికి కారణమని తెలిపాడు. బౌలింగ్లో ఇవ్వాల్సిన పరుగుల కంటే ఎక్కువ ఇచ్చామని.. ఫీల్డింగ్లో కూడా తప్పులు జరిగాయని పేర్కొన్నాడు.