సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. టీమిండియా మేనేజ్మెంట్ కారణంగానే ఘోర పరాజయాలను ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డాడు. జట్టులో ఏ ఒక్క ప్లేయర్ కూడా స్వేచ్ఛగా ఆడటం లేదని.. టీమ్లో చోటు ఉంటుందో లేదో అనే భయంతో ఆడుతున్నారని తెలిపాడు. దీంతో ఆటలో రాణించలేకపోతున్నారని చెప్పాడు.