AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పల్లో మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మృతిచెందగా.. అందులో మోస్ట్ వాంటెడ్, మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందిన హిడ్మాపై రూ.6 కోట్ల వరకు పలు రాష్ట్రాలు రివార్డు ప్రకటించాయి. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడులకు నేతృత్వం వహించారు.