బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మానవత్వానికి వ్యతిరేకంగా జరిపిన నేరాల కేసులో మరణశిక్ష పడడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ఈ తీర్పు చాలా తీవ్రమైన పరిణామం అని ఆయన వ్యాఖ్యానించారు. మరణశిక్ష సరైందా అనే అంశంపై ఈ చర్య మరోసారి చర్చకు దారితీస్తుందని థరూర్ అన్నారు. కాగా, అంతర్జాతీయంగా ఈ కేసు తీర్పు సంచలనంగా మారింది.