మహమ్మద్ షమీ రంజీల్లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో అతను భారత్ జట్టులోకి తిరిగి రావడం కష్టమేనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. షమీ ఖచ్చితంగా టీమిండియాలోకి తిరిగి వస్తాడని తెలిపాడు. సెలక్టర్లు అతడికి మరో అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.