సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్లో నిధుల కేటాయింపు తదితర అంశాలను లేఖలో ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. గత నాలుగేళ్లలో రెండు విడతలు కలిపి రూ.3,881 కోట్లు రుణమాఫీ...
బోరుగడ్డ అనిల్ ఫోన్ బెదిరింపు గురించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఏ ఫోన్ కాల్ అయినా తనకు ఎత్తడం అలవాటు అని చెప్పారు. మీటింగ్లో ఉన్నా, స్నానం చేసేప్పుడు వచ్చినా కాల్స్కు తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో సమస్యను చెబుతారు. కరెంట్ లేదని, చెత్త గురించి, పందులు, కుక్కలపై ఫిర్యాదు చేస్తుంటారని వివరించారు. పరిష్కరించే సమస్యను తన పీఏ సుబ్బన్నకు చెబుతా...
అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని ఫలితం దక్కింది. ఖాళీగా ఉన్న 5 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే స్థానం దక్కించుకోగా.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా.. ప్రతిపక్ష కూటమి మూడింటిని చేజిక్కించుకుంది. దీంతో మహారాష్ట్రలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు స్థానాలు ఖాతాలో వేసుకున్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సత్తా చాటింది. నాగ్ పూర్, ఔరంగాబాద్, అమరావతి స్...
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ ఫ్యామిలీకి తానే వీర విధేయుడినని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. జగన్ నీటి బొట్టు అని ఓదార్పు యాత్ర సమయంలో అనలేదా అని ప్రశ్నించారు. కాకాణి సొంత గ్రామంలో వైఎస్ విగ్రహాం ఏర్పాటు చేసే సమయంలో అడ్డుకోలేదా అని నిలదీశారు. తనకు కాకాణితో బంధం, బంధుత్వం, అనుబంధం, స్నేహం ఉందన్నారు. కాకాణి బావా...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రులు ముప్పేట దాడి చేశారు. రంగంలోకి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా దిగింది. టీడీపీలోకి వెళతానని కోటంరెడ్డి అనుచరులతో చెప్పారని గుసగుసలు వినిపించాయి. బీఆర్ఎస్లో కూడా అవకాశం ఉందంటున్నారు. సీఎం జగన్ను కోటంరెడ్డి ఏకవచనంతో ...
నంద్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారని టీడీపీ నాయకురాలు, మాజీ భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారని తెలిపారు. అయితే అతడి అక్రమాలు ఈ నెల 4వ తేదీన ఆధారాలతో సహా బయటపెడతామని అఖిల హెచ్చరించింది. అక్రమాలను బహిర్గతం చేస్తాను.. శనివారం నంద్యాలలోని గా...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. కుప్పం వరదరాజ స్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా.. నిన్న 8వ రోజు బంగారుపాళ్యం వద్ద 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వంద కిలోమీటర్ల మైలురాయికి వేదికగా నిలువడంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సమయంలో పోలీసులు అతిగా స్పందించారు. లోకేశ్ కాన్వాయ్లోని మూడు వాహనాలను సీజ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీం...
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నుంచి వస్తున్న విమర్శలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వలన తమకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ఏమాత్రం జంకు లేకుండా నిలదీస్తున్నారు. వీటిని తట్టుకోలేక మంత్రులు, ఎమ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరుతానని ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని.. తనపై ప్రభుత్వం నిఘా పెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. తాను వైసీపీకి దూరమవుతానని తెలి...
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా… గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రసంగించారు. కాగా…. గవర్నర్ ప్రసంగం పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. గవర్నర్ తో అబద్దాలు చెప్పించారని ఒకరు విమర్శించగా… గవర్నర్ తీరు పిల్లిలా మారిందని మరొకరు విమర్శించారు. గవర్నర్ బయట పులిలా గాండ్రించి సభలో పిల్లి తీరుగా ప్రసంగం చేశారని జగ్గారెడ్డి విమర్శించారు. గవర్నర్, కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని, పెద్ద...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని కొంతమేరైనా బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. ఇప్పటికే జనసేన నేత తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. ఏపీలోని మరికొంత మంది కాపు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం క...
తెలంగాణలో BRS పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు(mp nama nageswara rao)కు మరోసారి గట్టి షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసు(money laundering case)లో దర్యాప్తు యాథావిధిగా కొనసాగించాలని ఈడీ(enforcement directorate)కి హైకోర్టు తెలిపింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో బ్యాంకును మోసం చేశారనే ఆరోపణలతో ఈడీ అధికారులు.. నామా నాగేశ్వర్ రావు ఇంట్లో సోదాలు చేశారు. దీంతోపాటు ఎంపీకి చెందిన పలు ఆస్తులను కూడా జప్తు ...
ఏపీలో వచ్చే ఏడాది జూన్ లోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ(YSRCP) పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో కచ్చితంగా 175కు 175 స్థానాలు గెలవాలని వైసీపీ నేతలకు సూచించారు. ఇటీవల కుప్పుం నియోజకవర్గం నేతలతో సైతం జగన్(jagan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో కుప్పం(kuppam)లో ఏడుసార్లు గెలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ను ఓడించేందుక...
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా శుక్రవారం సినీ నటుడు పోసాని కృష్ణమురళి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. 2019 ఎన్నికల టైంలో పోసాని వైసీపీ తరపున జోరుగా ప్రచారం చేశారు. సీఎం జగన్ పోసానికి కీలక బాధ్యతలను అప్పజెప్పారు. విశాఖ కేంద్రంగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు పలు చర్యలు చేపట్...
తెలంగాణలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్(Congress) కంచుకోటగా ఉన్న ములుగు నియోజకవర్గం(mulugu constituency)పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి అనసూయ(dansari anasuya).. అలియాస్ సీతక్క(seethakka)పై పోటీ చేసేందుకు BRS తరఫున బడే నాగజ్యోతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంల...