బీఆర్ఎస్ (BRS Party)తో పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పండి అని రాహుల్ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. పొత్తు కొనసాగుతుందని ప్రచారం చేస్తూ బీజేపీ కుట్ర రాజకీయం చేస్తోందని, దానితో లబ్ధి పొందాలని చూస్తోందని వివరించారు.
ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడి హత్య కేసును యూపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాఫ్తు కోసం పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ నేతల వివాదంలో ఇప్పుడు పవన్ తల దూర్చారు. దీంతో... వైసీపీ నేతలంతా.. పవన్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పవన్... ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ నేతలు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సహా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట కలిగింది. సీబీఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారం ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజన్నపేట (Rajannapet)గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి కార్యాలయాన్ని ప్రారంభించారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇటీవల హరీశ్ చేసిన కామెంట్స్పై ఏపీ మంత్రులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రుల కామెంట్స్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని పవన్ అంటున్నారు.
ఏపీ సీఎం జగన్.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సమావేశం అయ్యారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలిసింది.
మొహంపై జాతీయ పతాకం పెయింటింగ్ వేసుకున్న బాలికను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రబంధక్ కమిటీ క్షమాపణ చెప్పింది.
ఈ సభ ద్వారానే కమలం పార్టీ ఎన్నికలకు శంఖారావం పూరించే అవకాశం ఉంది. ఈ పర్యటనలోనే కీలకమైన నాయకులను పార్టీలో చేర్పించుకునేందుకు చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ బృందం సిద్ధమైంది.