కాంగ్రెస్ లో మరోసారి గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. పార్టీ ప్రకటించిన కార్యాచరణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యమొచ్చినట్టు వ్యవహరిస్తే ఇక తామెందుకు అని పార్టీ సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీరి దెబ్బకు నల్లగొండలో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమం వాయిదా పడింది.
ఏపీ సీఎం జగన్ యూరప్ టూర్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే ఫోన్ వివరాలు, పర్యటన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
వైయస్ వివేకాహత్య కేసులో కడప పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డిని విచారణ సంస్థ సీబీఐ బుధవారం ఎనిమిది గంటల పాటు విచారించింది.
జనాభా పరంగా భారత్ చైనాను దాటి అగ్రస్థానానికి రావడంపై డ్రాగన్ దేశం స్పందించింది.
సినీ ఇండస్ట్రీలో పైరసీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీంతో సినీ పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపించవద్దని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
వివేకా హత్య కేసులో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్, అవినాష్ అనుచరుడు ఉదయ్పై సీబీఐ అధికారులు 10 ప్రశ్నలు గుప్పించారు.
పులివెందుల వైసీపీ కేడర్, అవినాశ్ రెడ్డి అనుచరుల నుండి తనకు ప్రాణ హానీ ఉందంటూ దస్తగిరి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నా వాటి సమాచారం గురించి ప్రజలకు తెలియడం లేదు. దీనివల్ల డబుల్ డెక్కర్ బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి.
జగన్ పాలన పైన ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు చంద్రబాబు. ఇచ్చేది 10 రూపాయలు అయితే తీసుకునేది వంద రూపాయలుగా ఉందన్నారు.
విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి కేశినేని చిన్ని తేనేతుట్టేను కదిలించారు. ఇక్కడినుంచి చిన్ని సోదరుడు నాని ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.
బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తరచూ తెలంగాణలో ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్నాయి. కేంద్రం చేసిన మోసాలు, మోదీ సాగిస్తున్న కుట్ర, వివక్షపై ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. బీజేపీ విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
చైనా జనాభాను భారత్ అధిగమించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి తెలిపింది.
మాజీ మంత్రి, కర్నాటక కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది.
ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. తాము నిర్ణయించుకున్న చోటే నిర్వహించాలని పట్టుబట్టారు. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను నిర్వహించి తీరాలని గులాబీ దళపతి ఉన్నారు.