W.G: పోలవరం ఏటిగట్టు సెంటర్ బస్టాండ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి కూటమి పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. మరుగుదొడ్లు లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమైంది.
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సర్వీసులను పొడగించాలని కేంద్రం రాజ్యసభలో ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ను గతేడాది ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పాసైతే కేంద్రం చేతుల్లోకి పూర్తిగా అధికారాలు వెళ్తాయని.. కాబట్టి బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని మన్మోహన్ను ఆప్ అధినేత కేజ్రీవాల్ కోరారు. దీంతో తొమ్మిది పదుల వయస్సులో ఆయన వీల్ చైర్లో రాజ్యసభకు వచ్చి ఓటేశారు.
W.G: ఉండి మండలం యండిగండిలో తులసి ఇంటికి వచ్చిన పార్శిల్లో డెడ్ బాడీ అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం సంచలనం రేపుతోంది. తులసి ఆస్తి కొట్టేయాలన్న కుట్రలో శ్రీధర్ వర్మ, అతని ఇద్దరి భార్యల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలో మూడో భార్య కుమార్తె హస్తం కూడా ఉందంటూ పోలీసులు ఆ చిన్నారిని నిందితురాలి జాబితాలో చేర్చారు.
VZM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి తీరని లోటని దేశ రాజకీయాల్లో మన్మోహన్ సింగ్కి ఒక ప్రత్యేకత ఉందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఆత్మకి శాంతి కలగాలని తన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈసందర్బంగా ఢిల్లీలో ఆయనతో సమావేశం మర్చిపోలేని తీపి గుర్తు అన్నారు.
KMM: వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.16,000, కొత్త మిర్చి ధర రూ.16,011గా పలికింది. అలాగే, క్వింటా పత్తి ధర రూ.7,100 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజూ కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.700, కొత్త మిర్చి ధర రూ.200, పత్తి ధర రూ.100 తగ్గినట్లు తెలిపారు.
తూర్పు గోదావరి: కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో ఓ పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలిక కావడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడైన పాస్టర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల కాంగ్రెస్ నేత శశిథరూర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానిగా మన్మోహన్ చివరి మాటలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ప్రస్తుతం ఉన్న మీడియా, పార్లమెంటులోని ప్రతిపక్షాల కంటే చరిత్ర.. నా పట్ల దయతో ఉంటుందని 2014లో మన్మోహన్ అన్నారు. సరిగ్గా పదేళ్ల తర్వాత అదే నిజమైంది’ అని శశిథరూర్ పేర్కొన్నారు.
HYD: ‘ఫేస్బుక్’ తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉన్న ఆఫీస్ స్పేస్ కోసం నెలకు రూ.2.15 కోట్ల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె రూ.2.8కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ ఐదేళ్ల కాలనికి చెల్లించాల్సిన అద్దె రూ.168 కోట్లు. దీని కోసం కంపెనీ రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ను చెల్లించింది.
KMM: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆర్థిక వేత్తగా, అధ్యాపకుడిగా, ఆర్బీఐ గవర్నర్గా, రాజ్య సభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానిగా ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
MBNR: ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ శుక్రవారం దిగ్భ్రాంతి తెలిపారు. ఈ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది అన్నారు. ఆర్థిక వేత్తగా, రిజర్వు బ్యాంకు గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఆయన సేవలు మరువలేనివి అన్నారు.
హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇవాళ్టితో కస్టడీ సమయం ముగుస్తుంది. దీంతో నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ వివరాలు కోర్టుకు తెలపనున్నారు.
NRML: భైంసా వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు ప్రకటించినట్లు తెలిపారు. దీంతో భూసార బీట్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని రైతులు, ఖరీదు దారులు గమనించి సహకరించాలన్నారు.
MNCL: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు జన్నారం వర్తక సంఘం నాయకులు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా పట్టణంలోని వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు. మన్మోహన్ చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వామన్ కుమార్, జక్కు రమేష్, కోశాధికారి శివకృష్ణ, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్ సభ్యులు ఉన్నారు.
MDK: కొల్చారానికి చెందిన ఎస్ఐ సాయికుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 2018లో విధుల్లోకి చేరిన సాయికుమార్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీబీపేట, బిక్కనూరులో విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన మృతి చెందడంతో అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు.
అన్నమయ్య: 10వ తరగతి పాసైన వివాహిత మహిళలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ మేరకు జిల్లాలోని 116 అంగన్వాడి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో ICDS ప్రాజెక్టు పరిధిలో ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కార్యకర్తల అంగన్వాడీ వర్కర్ 11, మినీ అంగన్వాడీ వర్కర్ 12, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 93 ఉన్నాయి.