CTR: తుఫాను కారణంగా ఎలాంటి ఘటనలు తలెత్తకుండా ప్రజలను అప్రమత్తత చేస్తూ అధికారులు సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని ఈవోపీఆర్డీ కృష్ణవేణి సూచించారు. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుందని వంకలు వాగుల వైపు ప్రజలు ఎవరు వెళ్లరాదని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు.
ప్రకాశం: త్రిపురాంతకం మండలంలోని గణపవరం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గణపవరం మెట్టవద్ద గల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇలా జరగటం ఒక నెల వ్యవధిలో ఇది రెండోసారి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చాట్జీపీటీ మొరాయించింది. యూజర్లు.. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ సమస్యను ఎదుర్కొన్నారు. అప్స్ట్రీమ్ ప్రొవైడర్ వల్లే ఈ సమస్య వచ్చినట్లు గుర్తించామని ఓపెన్ఏఐ తెలిపింది.
KDP: కడప నగరంలోని స్థానిక బిల్డప్ సర్కిల్ సమీపాన వెలసిన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం నందు అమ్మవారికి శుక్రవారం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
HYD: దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ శబరిమలకు వెళ్లే పలు ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా జనవరి 24న వెళ్లాల్సిన మౌలాలి – కొట్టాయం(07167), జనవరి 25న కొట్టాయం – మౌలాలి(07168) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎలాంటి బుకింగ్స్ చేసుకోలేదని రద్దీ లేకపోవడంతోనే రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
NLG: దామరచర్ల మండలం పుట్టగడ్డ తండాకు నేడు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రానున్నారు. పుట్టగడ్డ తండాలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని టీడీపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, NTR సుజల వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తారని తెలిపారు.
KDP: వర్షాల కారణంగా చేనేత కార్మికులు పనులు లేక జీవనాధారం కోల్పోయి కష్టాలు పడుతున్నారని జనసేన చేనేత కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం సిద్దవటం మండలంలోని పలు గ్రామాల్లో చేనేత మగ్గం గుంతలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులు కుటుంబంలో అందరూ పనిచేస్తే గాని పూట గడవని జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
HYD: మహానగరానికి కొత్త బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) దీనిపై కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయ కన్సల్టెంట్ల ఆధ్వర్యంలో కొత్త మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేస్తున్నారు. కొత్త ఏడాదిలో సెప్టెంబరు, అక్టోబరు నాటికి దీనికి సంబంధించి ముసాయిదాను విడుదల చేయనున్నట్లు తాజాగా అధికార వర్గాలు తెలిపాయి.
HYD: పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి వద్ద రోగులు ఆందోళనకు దిగారు. OP సేవలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో నిమ్స్ సిబ్బంది OP సేవలు నిలిపివేశారు. వైద్యసేవలు మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని రోగులు కోరుతున్నారు.
KMM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. కేంద్ర ఆర్థికమంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
HYD: చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ను ఈ నెల 28న రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు పేర్కొన్నారు. టెర్మినల్ పనులకు రూ.413 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ప్రయాణికుల రద్దీని తగ్గించడం కోసం సకల సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ను నిర్మించినట్టు వెల్లడించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాఠశాల విద్య మొత్తం ఉర్దూ మీడియంలో కొనసాగింది. ఆయన ప్రధాని అయ్యాక హిందీ ప్రసంగాలను సైతం ఉర్దూలో రాసుకొని ప్రసంగించేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్ముఖిలో రాసుకుని చదివేవారు. విభజన అనంతరం పంజాబ్లోని హిందూ కళాశాలలో చదివిన ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాఠశాల విద్య మొత్తం ఉర్దూ మీడియంలో కొనసాగింది. ఆయన ప్రధాని అయ్యాక హిందీ ప్రసంగాలను సైతం ఉర్దూలో రాసుకొని ప్రసంగించేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్ముఖిలో రాసుకుని చదివేవారు. విభజన అనంతరం పంజాబ్లోని హిందూ కళాశాలలో చదివిన ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.
KDP: ఆంధ్రప్రదేశ్ వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ, రైల్వే కోడూరులోని గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో రైల్వేకోడూరులో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గ్లోబల్ సెంటర్ నిర్వాహకుడు పార్థసారథి తెలిపారు. రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ 25 నుండి 35 సంవత్సరాల లోపు యువతి, యువకులు జాబ్ మేళాలో పాల్గొని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
పనామా కాలువ నుంచి వచ్చే షిప్పుల నుంచి అధికంగా పన్నూ వసూళ్లు చేస్తున్నారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. అందువల్ల పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాని ఆయన హెచ్చరించారు. ట్రంప్ చేసిన బెదిరింపులపై ఆయనతో చర్చించాల్సిన అవసరం లేదని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో పేర్కొన్నారు. న్యాయబద్ధంగానే ఓడల నుంచి పన్నులను వసూళ్లు చేస్తున్నట్లు చెప్పారు.