SRD: జిల్లాలోని ఏడు మండలాల్లో 129 పంచాయతీల్లో జరిగే ఎన్నికలకు పోలీస్ శాఖ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. 7 మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, 16 మంది పోలీసు అధికారులు, 1,120 మంది కానిస్టేబుళ్లను బందోబస్తుకు సిద్దం చేసింది. వారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తారు.