CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఎలక్ట్రిక్ సైకిళ్ల గురించి ప్రజలకు టీడీపీ శ్రేణులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 10వ క్లస్టర్కు చెందిన 2వ సచివాలయంలో ఎలక్ట్రిక్ సైకిళ్లపై గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ ఆర్ఆర్ రవి, టీడీపీ నేత మంజునాథ్,తదితరులు ప్రజలకు అవగాహన కల్పించారు. రూ. 5000 చెల్లించి ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకుంటే సులభతరంగా నెలవారీ EMI కట్టుకోవచ్చన్నారు.