• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహానందిలో రేపు వేలం

NDL: మహానందిలో ఈనెల 28వ తేదీన వివిధ అంశాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. లడ్డూ, పులిహోర కమీషన్ పద్ధతిన తయారు చేసే లైసెన్స్ హక్కు, నందీశ్వర కంకణాల సరఫరా, వివిధ రకాల ఫొటోస్ సరఫరా, రసీదు పుస్తకాల ముద్రణ, భక్తులకు అగరబత్తీలను విక్రయించేందుకు వేలాలు ఉంటాయన్నారు.

December 27, 2024 / 10:03 AM IST

మంచినీటి చెరువులో పడి వ్యక్తి మృతి

W.G: పెంటపాడు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న మంచినీటి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన దాడి వెంకటరమణ (40)గా గుర్తించారు. స్థానికంగా అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడని మృతుని బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి పెంటపాడు ఏఎస్ఐ రాజేంద్ర, కానిస్టేబుల్ శ్రీనివాస్ చేరుకున్నారు.

December 27, 2024 / 10:01 AM IST

విశాఖలో ఈనెల 28న జాబ్ మేళా

విశాఖ నగరంలోని మహారాణిపేట ఎన్ఎసీ కేంద్రంలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళా రాష్ట్ర నైపుణ్యం అభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పలు ప్రైవేటు కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని తెలిపారు.

December 27, 2024 / 09:59 AM IST

రాష్ట్రంలో ముగిసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పర్యటన

HYD: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆయన సతీమణి సుదేష్ ధన్‌ఖడ్లకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రోటోకాల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకట్‌రావు, డీజీపీ జితేందర్ ఇతర అధికారులు వీడ్కోలు పలికారు. రాష్ట్రంలో 2 రోజులపాటు పర్యటించిన ఉపరాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు.

December 27, 2024 / 09:58 AM IST

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 409 పాయింట్లు బలపడి 78,881 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 23,883 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 85.34గా ఉంది. కాగా, అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నా.. మదుపర్ల కొనుగోళ్ల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

December 27, 2024 / 09:58 AM IST

మనుబోలు హైవేపై ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గూడూరుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

December 27, 2024 / 09:58 AM IST

మన్మోహన్ సింగ్ మృతిపై ఎమ్మెల్యే సంతాపం

NRML: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంతాపం ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులను తీసుకువచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుందన్నారు. మాజీ ప్రధాని మంత్రి పీవీ నరసింహారావుతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన చక్కదిద్దారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

December 27, 2024 / 09:57 AM IST

‘మాజీ ప్రధాని మన్మోహన్ ఆత్మకు శాంతి చేకూరాలి’

GNTR:  మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ మృతి చెందడం పట్ల నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపకులు కనకం శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం మన్మోహన్ మృతిపై శ్రీనివాసరావు గురజాలలో మాట్లాడారు. రాజకీయాలలో మన్మోహన్ నిజాయితీ అందరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మన్మోహన్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

December 27, 2024 / 09:55 AM IST

కస్తూర్బా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు

SRD: కస్తూర్బా పాఠశాల ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో, వారి స్థానంలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల సమ్మె వల్ల విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకే ఉపాధ్యాలను సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దన్నారు.

December 27, 2024 / 09:54 AM IST

మాజీ ప్రధాని మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు

PDPL: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఎమ్మెల్యే విజయ రమణారావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వివిధ హోదాల్లో దేశానికి విశేష సేవలందించారు. నూతన భారతదేశానికి పునాదిని అందించి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా, వినయపూర్వకమైన నాయకుడిగా గుర్తుండిపోతారని అన్నారు.

December 27, 2024 / 09:54 AM IST

సాత్నాల ప్రాజెక్టు వివరాలు

ADB: జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు వివరాలను అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 25 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 282.10 అడుగులుగా ఉందని పేర్కొన్నారు. ఇన్ ఫ్లో 25 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.

December 27, 2024 / 09:51 AM IST

ఆ రైలు 2 నెలలు రద్దు

KDP: తిరుపతి-హుబ్లీ ప్యాసింజర్ రైలు సేవలను 28వ తేదీ నుంచి రద్దు చేసి, కుంభమేళా ఉత్సవాలకు పంపుతున్నట్లు రైల్వే అధికారి జనార్దన్ తెలిపారు. ఈ రైలు ఉమ్మడి కడప జిల్లాలోని బాలపల్లె, శెట్టిగుంట, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, హస్తవరం, నందలూరు, మంటపంపల్లె, ఒంటిమిట్ట, భాకరాపేట, కనుమలోపల్లి, కడప, కృష్ణాపురం, గంగాయపల్లె మొదలుగు గ్రామలునుండి ప్రయాణిస్తుంది.

December 27, 2024 / 09:50 AM IST

జేసీబీ చోరీ కేసులో వ్యక్తి అరెస్టు

VZM: జేసీబీ చోరీ కేసులో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన బి. హరికృష్ణను గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ నారాయణరావు, ఎస్ఐ యలమల ప్రసాదరావు, ఏఎస్ఐ అప్పారావు తెలిపారు. రామభద్రపురంలోని టీబీఆర్ సినిమా హాల్ వద్ద తారాపురం గ్రామానికి చెందిన ఎ. శివకు చెందిన జేసీబీని ఉంచగా చోరీ చేశారని చెప్పారు.

December 27, 2024 / 09:50 AM IST

మాజీ ప్రధాని మృతి పట్ల స్పీకర్ సంతాపం

Akp: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేశారని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.

December 27, 2024 / 09:48 AM IST

ప్రజా రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలి: ఎఎస్పీ

VZM: ప్రజల రక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో పోలీసులు ముందుండాలని ఎస్పీ అంకిత సురాన అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం కొమరాడ పోలీస్ స్టేషన్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, కేసుల నమోదు, వాటి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

December 27, 2024 / 09:48 AM IST