• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నామినేషన్ల ఉపసంహరణకు బుజ్జగింపులు!

KMR: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ఉపసంహరణకు అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లతో అదృష్టాన్ని పరీక్షించుకునే బదులు, అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని. తెలిసిన వారికి ఫోన్లు చేసి పరిస్థితిని వివరిస్తూ ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

December 7, 2025 / 01:24 PM IST

తరుణ్ భాస్కర్ మూవీ నుంచి డబుల్ ధమాకా

దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతి’. AR సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈషా రెబ్బా కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు అప్‌డేట్స్ ఇచ్చారు. రేపు ఈ మూవీ టీజర్ రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 23న ఇది థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.

December 7, 2025 / 01:20 PM IST

మాజీ వార్డ్ మెంబర్ మృతి… నేతల నివాళి

NLG: చిట్యాల పట్టణంలో మాజీ వార్డ్ మెంబర్ కొత్త పూలమ్మ మృతి చెందారు. వారి పార్థిక దేహాన్ని స్థానిక మునిసిపల్ మాజీ ఛైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ఇవాళ సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతురాలి కుమారుడు కొత్త శేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో నేతలు బొబ్బల రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ముత్తిరెడ్డి ఉన్నారు.

December 7, 2025 / 01:19 PM IST

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: తహశీల్దార్

గుంటూరు: పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులోని రైతు సేవా కేంద్రాన్ని తహశీల్దార్ జియావుల్ హక్ ఆదివారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సిబ్బందినీ అడిగి తెలుసుకొని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. రికార్డులు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, కేంద్రం ద్వారా గిట్టుబాటు ధరకు ధాన్యం విక్రయించుకోవచ్చని తెలిపారు.

December 7, 2025 / 01:15 PM IST

‘ఈ పెద్దాయనను చూసి యువత జ్ఞానవంతులు కావాలి’

SRD: రాజకీయాలపై ఆసక్తి చూపని యువత 75 ఏళ్ల నవ యువకుడిని చూసి, క్రియాశీలక రాజకీయాలలో యువకులు పాల్గొనాలని మేధావుల ఫోరం సభ్యులు హైకోర్టున్యాయవాది కిషన్ మామిళ్ళ అన్నారు. పటాన్ చెరువు మండల బానూరు పంచాయతీ ఎన్నికలలో 7వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుప్పాలగూడెం శ్రీశైలంను గెలిపించాలని కోరారు. వారి గెలుపునైనా చూసిన తరువాతైనా యువతో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

December 7, 2025 / 01:14 PM IST

స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్.. ఫొటో వైరల్

జూ.ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు. గాగుల్స్ పెట్టుకుని సోఫాలో కూర్చొని ఉన్న ఎన్టీఆర్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో తారక్ లుక్ బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నాడు. అయితే రేపటి నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

December 7, 2025 / 01:13 PM IST

ప్రజలతో ప్రత్యక్ష భేటీ

PDPL: రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్‌లో ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మనాలి ఠాకూర్ విస్తృత పర్యటన చేశారు. రహదారులు, కాలువలు, తాగునీరు, స్ట్రీట్ లైట్ల సమస్యలను ప్రజలు వివరించగా, ఆమె వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

December 7, 2025 / 01:13 PM IST

కలెక్టర్ ఆఫీస్ ఎదుట 104 ఉద్యోగులు నిరసన

SKLM: గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే 104 వాహనాల సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని యూనియన్ నేతలు ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తగిన వేతనాలు లేకపోవడం, సిబ్బందికి చెల్లించాల్సిన గ్రాట్యువిటీ, ఎర్న్ లీవ్ బకాయిలు అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

December 7, 2025 / 01:12 PM IST

తెలంగాణలో విచిత్ర ప్రభుత్వం: ఎంపీ అర్వింద్

TG: రాష్ట్రంలో విచిత్ర ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, హామీల వైఫల్యంలో రికార్డ్ బ్రేక్ చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. వంచించడమే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ అన్నారు. గతంలో హైడ్రా, మూసీ పేరుతో.. ఇప్పుడు రైజింగ్ తెలంగాణతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని చెప్పారు.

December 7, 2025 / 01:12 PM IST

కాశీబుగ్గలో మూడు నెలలుగా డీఎస్పీ లేరు

SKLM: కాశీబుగ్గ సబ్ డివిజన్ కార్యాలయంలో సుమారు మూడు నెలలుగా డీఎస్పీ లేకుండా… కేవలం ఇంఛార్జ్ అధికారితో పాలన కొనసాగిస్తున్నారు. టెక్కలి డీఎస్పీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆయన అక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. గతంలో డీఎస్పీ బదిలీ అయిన ఒక్క రోజులోనే మరో డీఎస్పీని ఇక్కడ నియమించేవారు.

December 7, 2025 / 01:10 PM IST

ఓటును కొనడం అమ్మడం చట్టరీత్య నేరం: ఎస్సై

WNP: స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గోపాల్ పేట ఎస్సై నరేష్ ఆదివారం ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఓటును కొనడం, అమ్మడం చట్టరీత్యా పెద్ద నేరమని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా అటువంటి ప్రయత్నాలు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ నెంబర్ 8712670614కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

December 7, 2025 / 01:09 PM IST

పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగుల్లో భయం

WGL: జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఓటు ఎవరికి వేశారో లెక్కింపులో స్పష్టంగా తెలిసే అవకాశం ఉండడంతో “ఎందుకొచ్చిన గొడవ” అంటూ చాలా మంది ఓటు వేయకుండానే ఉండాలని నిర్ణయించారు. గ్రామ వార్డుల్లో ఓటర్లు వందల్లోనే ఉండటంతో ఎవరికి ఓటు వేశారో అందరికీ తెలిసిపోతుందనే భయం ఉద్యోగులను కలవరపెడుతోంది.

December 7, 2025 / 01:08 PM IST

నవాబుపేటలో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి

MBNR: నవాబుపేట మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్మనుండ్లకు చెందిన పెయింటర్ చంద్రయ్య (59) మృతి చెందాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. MBNR ప్రధాన రహదారిపై బోరు బండి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 7, 2025 / 01:08 PM IST

శరవేగంగా పిల్లగుండ్ల పల్లి గ్రామ అభివృద్ధి పనులు

CTR: ఎస్ఆర్ పురం మండలం పిల్లి గుండ్లపల్లి గ్రామ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గ్రామంలో గత 30 సంవత్సరాలుగా 15 ఇండ్లకు దారి సమంగా లేకపోవడం వలన గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం గ్రామస్థులు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి రూ. 5లక్షల CC రోడ్ నిర్మాణ కొరకు మంజూరు చేశారు.

December 7, 2025 / 01:07 PM IST

యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చు

యోగాతో ఒత్తిడిని అధిగమించి చదువు మీద ఏకగ్రీవం పెంచి ఉన్నత స్థాయికి చేరవచ్చని యోగా గురువు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం డీఏఆర్ ప్రాంగణంలో జరిగిన ఫిట్ ఇండియా కార్యక్రమం ఆర్ఐ బ్రహ్మానందం పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ఫిట్నెస్ మా జీవన విధానం అనే కాన్సెప్ట్ తో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు.

December 7, 2025 / 01:05 PM IST