TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ్టి విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 6న హాజరుకావాలని పోలీసులు తెలిపారు. తన తండ్రికి హార్ట్ ఆపరేషన్ అయ్యిందని అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు కౌశిక్ రెడ్డి పోలీసులకు చెప్పారు. 10 రోజుల గడువు కోరారు. కాగా, ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్ వెళ్లిన MLA.. సీఐతో దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదైంది.
KMR: బిక్కనూర్ మండలం తిప్పాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం, కాచాపూర్ గ్రామంలోని విశ్వేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించినందున, కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
HYD: తెలుగు వికీపీడియా పై అందరికీ అవగాహన అవసరమని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలుగు వికీపీడియాలో లక్ష వ్యాసాలు దాటిన సందర్భంగా హైదరాబాద్ బుక్ఫెయిర్ వేదికగా లక్ష వ్యాసాల ప్రస్థానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికీపీడియా గురించి మీకు తెలుసా..? అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
KRNL: మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల కర్నూలు మాజీ MLA హఫీజ్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం దేశానికి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు.
SRPT: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన హుజుర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కీతవారిగూడెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (26) శీలం ఉపేందర్ (24) లు హుజూర్ నగర్ వచ్చి తిరిగి వెళుతుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ని వారి పల్సర్ బైక్తో బలంగా ఢీకొట్టారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,564 మంది భక్తులు దర్శించుకోగా.. 24,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
HYD: జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో నేడు యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలకు కూడా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.
ADB: బాగా చదువుకుని మంచి పేరు తేవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. దివంగత ఆదివాసి ఉద్యమ నాయకుడు ఉయిక సంజీవ్ కుమార్తె చదువుల కోసం ఆయన ఉట్నూరు పట్టణంలో రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు.
SKLM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరనిలోటు అని శ్రీకాకులం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం రాత్రి ఆయన సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ 1958లో గురుశరణ్ కౌర్ కోహ్లిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఉపిందర్, దామన్ సహా అమృత్ అనే ముగ్గురు కుమార్తెలు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్నపటికీ.. కుటుంబం ఎక్కువగా వెలుగులోకి రాలేదు. వారందరూ మతాంతర వివాహాలు చేసుకోవడం విశేషం. వారంతా రాజకీయాలకు దూరంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దామన్ రచయిత్రిగా ప్రఖ్యాతి చెందారు.
MBNR: దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ గవర్నర్గా, పీవీ నరసింహారావు క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక విధానం ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టిష్ట పునాది వేశారన్నారు.
BDK: బొగ్గు ఉత్పత్తిలో రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి సూచించారు. మణుగూరు ఏరియాలో పర్యటించిన డైరెక్టర్ ఓసీ 2, ఓసీ 4 గనులను సందర్శించారు. గనుల్లో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మణుగూరు ఏరియాలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
WNP: సిద్దిపేట్ జిల్లాలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్య సమితి సభ్యుడిగా ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్ల నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్య సమితి సభ్యుడిగా నియమించినందుకు అర్జున్ సాతర్ల రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
MNCL: సింగరేణియులు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాకుండా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయమని మందమర్రి జీఎం దేవేందర్ కొనియాడారు. ఏరియాలోని వృత్తి శిక్షణ కేంద్రంలో సింగరేణి, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జీఎం ప్రారంభించారు.
WGL: ఖిలా వరంగల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒకరిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. పడమర కోటకు చెందిన తాడెం భరత్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సీఐ రంజిత్ ఎస్సై దిలీప్ పోలీసు బృందంతో కలిసి తనిఖీలు చేశారు. రెండు మొబైళ్లు, రూ. 2,46,700 స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.