HYD: ‘ఫేస్బుక్’ తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉన్న ఆఫీస్ స్పేస్ కోసం నెలకు రూ.2.15 కోట్ల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె రూ.2.8కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ ఐదేళ్ల కాలనికి చెల్లించాల్సిన అద్దె రూ.168 కోట్లు. దీని కోసం కంపెనీ రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ను చెల్లించింది.