E.G: నిడదవోలు మండలం కంసాలిపాలెంలో శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామని BJP జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంసాలిపాలెంలో శ్మశాన వాటిక సమస్యను ఎంపీ పురందీశ్వరి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
AP: అన్నమయ్య, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద 50 రోజుల అదనపు పనిదినాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ పేదల సంక్షేమం కోసం ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 2025 ఖరీఫ్లో రాష్ట్రప్రభుత్వం ఈ జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది.
KDP: ఇటీవల నిర్వహించిన నాసా (ఎన్ఎస్వో) పరీక్షలో పులివెందుల విద్యార్థిని మెహరీన్ అంజు ప్రతిభను చాటుకుంది. రెండో తరగతి చదువుతున్న ఆమె రాష్ట్ర స్థాయిలో 98వ ర్యాంకు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఇంతటి ప్రతిభ కనబరిచిన మెహరీన్ అంజు విజయానికి ఆమె కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకం కీలకంగా మారాయి.
SRD: పటాన్ చెరువులో రూ.100 కోట్ల CSR నిధులతో నిర్మించి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న “పెద్ద దవాఖానకు పెద్దాయన డాక్టర్ కిషన్ రావు పేరుకై” తీవ్రంగా కృషి చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి నీలం మధు అన్నారు. జిల్లాకు 567 కోట్ల CSR నిధులు తెచ్చిన ఘనత డాక్టర్ కిషన్ రావుది అన్నారు.
అనకాపల్లిలో ప్రైవేట్ పాఠశాలలు కళాశాలకు విద్యార్థులను తీసుకువెళ్లే స్కూల్ బస్సులు, ఆటోలను గురువారం తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ తెలిపారు. డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలను వివరించారు.
NRPT: కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి జరగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. గురువారం ఆత్మకూరు మున్సిపాలిటీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అభివృద్ధికి ఎన్ని నిధులైనా తీసుకొస్తానని, అన్ని వార్డుల్లో సమానంగా పనులు జరగాలని అధికారులను ఆదేశించారు.
HNK: వరంగల్ రైల్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణం, ప్లాట్ఫామ్లపై ఉన్న ప్రయాణికుల సామాన్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆర్.ఐ తెలిపారు. అనుమానితుల వివరాలు సేకరించి, ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరుకానున్నారు. ఈ మేరకు డీబీఎఫ్ (DBF) అధ్యక్షుడు దుబాసి సంజీవ్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అంబేడ్కర్ యువజన సంఘాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు, అట్రాసిటీ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
TG: న్యుమోనియాకు కొత్త టీకాను బిట్స్ పరిశోధకులు కనుగొంది. స్పెక్ట్రోస్కోపీ విధానం ద్వారా వ్యాక్సిన్ను అభివృద్ది చేశారు. ఇటీవలే ఎలుకలపై ప్రయోగించగా విజయవంతమైందని పరిశోధకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తర్వాత క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు.
JGL: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, మెట్పల్లి మండలం కొండ్రిక్యాల రైస్ మిల్లులను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నిర్దేశిత గడువులో కోటాను పూర్తి చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. అనంతరం 544 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.
NGKL: పదర మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం ప్రహరీ గోడను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తుల కోరిక మేరకు ప్రహరీ గోడతో పాటు మిగిలిన పనులను పూర్తి చేయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అనురాధ, భక్తులు పాల్గొన్నారు.
WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం బాల్య శశిరేఖ ఈ నెల 20న నర్సంపేటలోని కుమార్తె ఇంటికి వెళ్లగా, గురువారం ఇంటి తాళం పగులగొట్టినట్లు గుర్తించారు. బీరువాలో ఉన్న 60 తులాల వెండి, 10 గ్రాముల బంగారం అపహరించబడింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
HNK: జిల్లా నూతన కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వరంగల్ మహానగర పాలక సంస్థ (GWMC) కమిషనర్గా సేవలు అందించిన ఆమెను ప్రభుత్వం కలెక్టర్గా నియమించింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు.
MBNR: TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి 1న 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.