• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కృతిసనన్‌కు ఉత్తమ నటి అవార్డు.. నెట్టింట విమర్శలు

జీ సినీ అవార్డ్స్ 2026 వేదికగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ఉత్తమ నటి అవార్డను గెలుచుకుంది. ‘తేరే ఇష్క్ మే’ మూవీలో నటనకు గాను ఈ అవార్డు లభించింది. అయితే, ఆమెను విజేతగా ప్రకటించగానే SMలో విమర్శలు హోరెత్తాయి. ఈ అవార్డుకు యామీ గౌతమి అర్హురాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘హక్’ మూవీలో యామీ నటన అద్భుతమని, ఆమెను కాదని కృతికి అవార్డు ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు.

March 4, 2026 / 09:02 AM IST

ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం

నారాయణపేట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు మంగళవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. సీఐ అనంతయ్య తెలిపిన వివరాల ప్రకారం, రెండు వాహనాల వేలంలో ఒక వ్యక్తి రూ.68,020 చెల్లించి వాటిని సొంతం చేసుకున్నాడు. మొత్తం 20 మంది పాల్గొన్న ఈ వేలంపాట ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని తెలిపారు.

March 4, 2026 / 09:02 AM IST

20 బోరు మోటార్ల కేబుల్స్ చోరీ

SRPT: గరిడేపల్లి మండలంలోని సుభాష్‌నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఒకేరాత్రి 20 వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని బాధిత రైతులు గాదె మల్లారెడ్డి, జానపాటి శంకర్, కుసుమ సైదిరెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు.

March 4, 2026 / 09:02 AM IST

ప్రభ బండి ప్రారంభించిన ఛైర్మన్

WGL: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి గారికి నాలుగో వార్డ్ కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రభ బండిని ఛైర్మన్‌ పెండెం లక్ష్మి రామానంద్ కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి కటాక్షంతో ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

March 4, 2026 / 09:02 AM IST

ఏన్కూరులో PHC లో రేపు మెగా హెల్త్ క్యాంప్

KMM: ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గైనకాలజిస్ట్ డా.అపర్ణ, పిడియాట్రిషన్ డా.రాంబాబు, ఆప్తమాలజిస్ట్ డా.రాము నాయక్, ఆర్థోపెడిక్స్ డా.హనుమాన్, డెంటిస్ట్ డా.లావణ్య వంటి నిపుణులు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందిస్తారన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

March 4, 2026 / 09:02 AM IST

ఢిల్లీపై దండోరా గోడపత్రికల ఆవిష్కరణ..!

JN: లింగాల గణపురం మండలం వడిచర్ల, నేలపోగుల, అప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం ఢిల్లీపై దండోరా గోడపత్రికలను కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రణ సాధన సమితి ప్రతినిధులు, డప్పు కళాకారులు ఆవిష్కరించారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న ఢిల్లీలో దండోరా చేపట్టనున్నట్లు తెలిపారు.

March 4, 2026 / 09:01 AM IST

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష

MBNR: జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం ఒక మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన నిందితుడు యెర్ర సురేష్‌కు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించింది. 2022లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టి, చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష పడింది.

March 4, 2026 / 09:01 AM IST

నేటి నుంచి ఇంటర్ వ్యాల్యూయేషన్

NLG: ఇంటర్ పరీక్షల మూల్యాంకనం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ముందుగా సంస్కృతం పేపర్ వ్యాల్యూయేషన్ చేపట్టగా, ఈ నెల 15న మరో నాలుగు సబ్జెక్టులు, 16, 17 తేదీల్లో మిగిలినవి ప్రారంభమవుతాయి. NLGలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం మూల్యాంకనానికి నియమితులైన అధ్యాపకులు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని DIEO సూచించారు.

March 4, 2026 / 09:01 AM IST

పొట్టి కప్ అంటే ‘ఆసియా’ ఉండాల్సిందే!

T20 WC 2026 సెమీస్‌లో 4 ఖండాల నుంచి 4 వేర్వేరు దేశాలు(SA-ఆఫ్రికా, NZ-ఓషియానియా, IND-ఆసియా, ENG-యూరోప్) తలపడుతున్న సంగతి తెలిసిందే. గత 9 టోర్నీల రికార్డులు గమనించినా.. ప్రతిసారీ ఆసియా నుంచి కనీసం ఓ జట్టు(భారత్, పాక్, లంక, అఫ్గన్) అయినా నాకౌట్స్‌లో తలపడింది. ఆసియా తర్వాత.. ఓషియానియా నుంచి 2009, 14, 24 మినహా అన్ని టోర్నీల్లోనూ ఆస్ట్రేలియా/న్యూజిలాండ్/రెండూ ఆడాయి.

March 4, 2026 / 08:59 AM IST

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్

GNTR: కొల్లిపర మండలం చక్రాయపాలెం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలుమూరు రీచ్ నుంచి ఎటువంటి అనుమతులు, బిల్లులు లేకుండా తెనాలికి ఇసుకను తరలిస్తుండగా, ఎస్సై ప్రసాద్ తనిఖీలు చేపట్టి వాహనాలను పట్టుకున్నారు. కొత్త చిలుమూరు, అన్నవరపు లంక గ్రామాలకు చెందిన ఈ ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేశారు.

March 4, 2026 / 08:58 AM IST

9 ఏళ్లకే ఇన్వెంటర్‌గా సన్నీ లియోన్ కూతురు

సన్నీ లియోన్ కుమార్తె నిషా(9) ‘బూ బాక్స్’ అనే టిష్యూ హోల్డార్‌ను కనిపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టిష్యూ వాడుకున్న తర్వాత పక్కనే పడేసేలా చిన్న డస్ట్ బిన్ కలిపి ఉండేలా దీన్ని డిజైన్ చేసింది. దీనికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా లభించాయి. అలర్జీ సమస్యతో టిష్యూలు వాడే క్రమంలో వచ్చిన ఈ ఆలోచన ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్‌గా మారి నిషాకు డబ్బును తెచ్చిపెడుతోంది.

March 4, 2026 / 08:55 AM IST

ఇందిరమ్మ కాలనీలో రేషన్ బియ్యం సీజ్

సత్యసాయి: ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని టూటౌన్ SI వీరేష్ సీజ్ చేశారు. అక్రమ రవాణాపై అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

March 4, 2026 / 08:50 AM IST

మహా కుంభాభిషేకం ఏర్పాట్లు పూర్తి

TPT: గాంధీపురం పంచాయతీలో నూతనంగా నిర్మించిన కామాక్షి సమేత అగస్తీశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకానికి నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు మహా కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

March 4, 2026 / 08:49 AM IST

తలారి రంగయ్యను అభినందించిన వైఎస్ జగన్

ATP: మాజీ ఎంపీ తలారి రంగయ్య తాడేపల్లిలో బుధవారం మాజీ సీఎం జగన్‌ను కలిశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆర్డీటీ సంస్థకు FCRA పునరుద్ధరణ కోసం చేపట్టిన ‘లక్ష పోస్ట్‌కార్డుల ఉద్యమం’ గురించి జగన్‌కు వివరించారు. రంగయ్య పోరాటాన్ని జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రజా పక్షపాతిగా నిరంతరం శ్రమించాలని రంగయ్యకు సూచించారు.

March 4, 2026 / 08:48 AM IST

నాడు సైమా, నేడు నంది అవార్డ్

SDPT: చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల నర్మదకు హైదరాబాదులోని బిర్లా మందిరం భాస్కరాచార్య ఆడిటోరియంలో బ్యూటిషన్ రంగంలో చేసిన సేవలకు నంది అవార్డును బాబు మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కత్తుల నర్మద మాట్లాడుతూ.. ఏ రంగంలో అయినా పట్టుదలతో, సమయ స్ఫూర్తితో, కష్టపడి పని చేస్తేనే గుర్తింపు వస్తుందని ఆమె అన్నారు.

March 4, 2026 / 08:47 AM IST