• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

28న మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ మోహినికుంట మల్లిఖార్జున స్వామి ఆలయ హుండీని ఈనెల 28న ఉదయం 11 గంటలకు లెక్కించబడునని ఆలయ పూజారి భద్రయ్య ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఆలయ ఆవరణలో జరిగే హుండీల లెక్కింపునకు పర్యవేక్షణకు దేవాదాయ శాఖ, జగిత్యాల డివిజన్ పరిశీలకులు పర్యవేక్షణలో భక్తుల సమక్షంలో హుండీలు లెక్కించబడునని పేర్కొన్నారు.

February 24, 2026 / 08:07 PM IST

కేసుల పరిష్కారంలో సాంకేతికతను వాడాలి: ఎస్పీ

WG: జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మంగళవారం భీమవరం ఆయన కార్యాలయంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో నెలవారీ నేర సమీక్ష చేపట్టారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విధానాన్ని విరివిగా ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని, మార్చి 14న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 08:07 PM IST

‘మత్స్యకారులకు న్యాయం చేయాలి’

BPT: ఈపూరుపాలెం వద్ద ధ్వంసమైన సముద్ర ముఖద్వారాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పరిశీలించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో మత్స్యకారుల పొట్టకొట్టడం దారుణమన్నారు. సముద్ర తీరాన్ని ధ్వంసం చేసిన శ్రీ భ్రమర ఇన్‌ఫ్రా యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. దొంగ పట్టాలను రద్దు చేసి, అక్రమ రిసార్టులను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 08:05 PM IST

‘పరీక్షలకు సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి’

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్ష CS వెంకటకేశవులు తెలిపారు. ఫస్టియర్ 200 మంది, సెకండియర్ 187 మంది ఉండగా.. మొత్తం 387 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వాహిష్ఠమని ఆయన పేర్కొన్నారు.

February 24, 2026 / 08:04 PM IST

ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

BDK: భద్రాద్రి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాల్లో 18,685 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మార్చి 18 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

February 24, 2026 / 08:04 PM IST

పాల కేంద్రాల్లో తనిఖీలకు ప్రత్యేక డ్రైవ్

AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాల కేంద్రాల్లో తనిఖీలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. కల్తీ పాల ఘటనలో ఏడుగురు పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల నివాస ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా వైద్యులను నియమించనుంది. మరో ఐదు రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయని తెలిపింది.

February 24, 2026 / 08:04 PM IST

‘నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి’

KMM: డిప్యూటీ సీఎం నివాసాలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇవాళ మర్యాపూర్వకంగా కలిశారు. వైరా నియోజకవర్గ సమస్యలను వారికి వివరించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

February 24, 2026 / 08:03 PM IST

ఇద్దరు బాలురను తల్లిదండ్రులకు అప్పగింత

CTR: కుప్పం రెసిడెన్షియల్ పాఠశాల నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలురను కుప్పం రూరల్ పోలీసులు 6 గంటల్లోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, పోలీసు బృందం యొక్క వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయత్నాలను అభినందించారు. తల్లిదండ్రులు సకాలంలో చర్య తీసుకున్నందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 08:03 PM IST

పీయూలో ‘వికసిత్ భారత్’ యూత్ పార్లమెంట్

పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ (N.S.S) వాలంటీర్లు పాల్గొనవచ్చన్నారు. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.

February 24, 2026 / 08:02 PM IST

పోలీస్ క్రీడాకారులకు ఆరు పథకాలు

MDK: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ చూపి ఆరు రజత పతకాలు సాధించారు. పథకాలు సాధించిన రాథోడ్ రమేష్ (టెన్నిస్ సింగిల్స్, డబుల్స్), భవాని, వీణ, సుష్మ (కబడ్డీ)లను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించి, సన్మానించారు.

February 24, 2026 / 08:01 PM IST

రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

ఆసిఫాబాద్ మండలం కొఠారి గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొన్నాయన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. పలువురికి గాయాలు కాగా ఆసుపత్రి తరలించమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 08:01 PM IST

ఆస్పిరేషన్ బ్లాక్‌లో నీతి ఆయోగ్ ప్రతినిధి పర్యటన

NRPT: నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ గౌరవ్ కటియార్ మంగళవారం నర్వ మండలంలోని పెద్ద కడుమూరు, రాయికోడ్, పాతర్ చేడ్ గ్రామాల్లో పర్యటించారు. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

February 24, 2026 / 08:01 PM IST

క్రికెట్ టోర్న విజేత రేగోడ్ జట్టు

SRD: ఖేడ్ పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నీలో రేగొడ్ జట్టు విజయం సాధించింది. AIBESS నేతృత్వంలో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రేగోడ్ ఆధ్యా, ఖేడ్ ర్యామ్ స్పోర్ట్స్ తలపడ్డాయి. రేగోడ్ జట్టు టోర్నీ కప్ సాధించింది. ఈ మేరకు పటాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

February 24, 2026 / 08:01 PM IST

జర్నలిస్టుల డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

KNR: తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ డైరీని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. జర్నలిస్టుల డైరీ తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:01 PM IST

‘పీఎంశ్రీ పథకంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి’

ATP: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పీఎంశ్రీ పథకం ఎంతో దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ సచ్చిదానంద ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో జేసీ విష్ణుచరణ్‌తో కలిసి పీఎంశ్రీ పాఠశాలల పనితీరుపై ఆయన సమీక్షించారు. అనంతరం ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.

February 24, 2026 / 08:00 PM IST