ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ తుదిశ్వాస విడిచారు. ఎఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరపడంతో తీవ్ర రక్తస్రావమైంది. తొలుత బ్రజ్ రాజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి భువనేశ్వర్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దగ్గర నుంచి ఛాతీపై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. మరో ముగ్గురు కూడా గాయపడ్డారట. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు ...
ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్పై కాల్పులు జరిపిన ఎఎస్ఐ గోపాల్ దాస్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారట. అతని భార్య ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపింది. గత కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని, మందులు కూడా వాడుతున్నారని పేర్కొంది. ‘ఏం జరిగిందో నాకు తెలియదు. వార్తల్లో చూసి తెలుసుకున్నా. ఘటనా జరిగిన సమయంలో నేను ఇంట్లో ఉన్నాను. ఈ రోజు ఉదయం నుంచి తాను భర్తతో మాట్లాడలేదని తెలిపింది. ఉదయం తన కూతురు వీడియో కా...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఏ విషయంలో క్లారిటీ లేకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గడపగడపకు కార్యక్రమంలో మంత్రి రజని పాల్గొన్నారు. పాదయాత్ర ఎందుకో.. ఆ యాత్ర లక్ష్యం ఏమిటో ఆయనకే తెలియనట్టు...
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందు బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా నుంచి తుది జట్టులో చోటు దక్కించుకున్న వారిలో హార్థిక్ పాండ్యా(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), దీపక్ ...
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. కొత్త సచివాలయ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పొగమంచులో సచివాలయ వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. మంచులో సచివాలయం తాజ్ మహల్ను తలపిస్తోంది. దీంతో పలువురు లైక్, చేసి కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. సచివాలయం, తాజ్ మహల్ను పోలి ఉందని రాస్తున్నారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా.. ఇదీ సచివాలయమేనా.. లేదంటే ఆగ్రాలో ఉన్న తాజ్ మహాల్ అనే స...
అమ్మాయేమో విదేశాల్లో.. అబ్బాయేమో భారతదేశంలోని మారుమూల పల్లెటూరు. అయినా వారిద్దరినీ కలిపింది ఫేస్ బుక్. వారిద్దరికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం కాగా.. అది కాస్త కొన్నాళ్లకు ప్రేమగా చిగురించింది. అలా పదకొండేళ్లు ప్రేమించుకున్నారు. కలుసుకునే అవకాశం లేక ఫోన్లు, వాట్సాప్ ద్వారా ప్రేమించుకుంటూ వచ్చారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతుండడంతో వెంటనే అమ్మాయి స్వీడన్ దేశం నుంచి భారత్ కు వచ్చేసింది. వచ్చి రాగానే...
జనవరి 31 నుంచి పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు...
ముందస్తు ఎన్నికలకు వెళదాం అంటూ మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాళ్లు విసరుకున్నారు. నిజామాబాద్ పర్యటనలో నిన్న మంత్రి కేటీఆర్ కామెంట్ చేయగా, ఈ రోజు బండి సంజయ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని బండి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ తన తండ్రితో చెప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో కోవర్డులు ఉండర...
రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు ఢిల్లీలోని విజయ్ చౌక్ లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ముగింపు సందర్భంగా బీటింగ్ రీట్రీట్ ను నిర్వహిస్తున్నారు. మిలిటరీ బ్యాండ్ 29 ఇండియన్ ట్యూన్లను ప్లే చేస్తున్నారు. అలాగే.. 3500 స్వదేశీ డ్రోన్లతో ప్రదర్శన జరగనుంది. భారీగా వర్షం కురుస్తున్నా బీటింగ్ రీట్రీట్ ...
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడీ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర చివరి మజిలీగా శ్రీనగర్లో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు రాహుల్. సోనావార్లో 30 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారని, అక్కడ నుంచి ఘంటా ఘర్...
ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. ఘాట్ దిగుతున్న సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో డ్యామ్ రక్షణ గోడను ఢీకొట్టింది. రక్షణ గోడ కూలిపోగా అక్కడే ఉన్న ఇనుప రాడ్ అడ్డు పడడంతో బస్సు ఆగిపోయింది. లేకుంటే బస్సు నేరుగా శ్రీశైలం డ్యామ్ లోకి పడిపోయి ఉండేది. ఈ ఘటనతో బస్సులోని 30 మంది ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు ఆగిపోవడంతో దేవుడా అంటూ ఊపిరి పీ...
మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు సోదరిమణులు ఒక్క చోటకు చేరారు. వారితో పాటు వారి పిల్లలు, కోడళ్లు, మనుమలు, మనువరాళ్లతో చిరంజీవి నివాసం సందడిగా మారింది. జనవరి 29 చిరంజీవి తల్లి జన్మదినం. ప్రతి యేటా ఆమె పుట్టిన రోజును కుటుంబసభ్యులు అందరి కలిసి ఘనంగా నిర్వహిస్తారు. గతేడాది కరోనా కారణంగా చిరంజీవి దూరంగా ఉన్నారు. తాజాగా ఆదివ...
ఈరోజుల్లో ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తున్నాయి. ఇదివరకు అడవుల్లోనే కోతులు కనిపించేవి. కానీ.. ఇప్పుడు మాత్రం అడవులను వదిలేసి కోతులు ఊళ్ల మీద పడ్డాయి. ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయి. దొరికింది దొరికినట్టుగా అందుకొని పారిపోతున్నాయి. కొందరు కోతులను చూస్తేనే భయపడతారు. అవి చేసే చేష్టలు కూడా అలాగే ఉంటాయి. ఒంటరిగా కోతులు ఉన్న చోటుకు వెళ్తే ఇక అంతే. అన్నీ మీద ఎగబడటం ఖాయం. అందుకే కోతులకు ఎంత దూరంగా ఉంటే అంత...
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపించారు. 3 నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తనకు మరో ఫోన్ ఉందన్నారు. 12 సిమ్ కార్డులు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్ను పెగాసస్ రికార్డు చేయలేదని స్పష్టంచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి అభిమానులకు తెలిపారు. ఇవాళ ఉదయమే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను పరామర్శించిన అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27 వ తారీఖున మా కుటుంబంలో దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇది చాలా దురదృష్టకర...