• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భూదాన్ బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి

BDK: భూదాన్ భూముల్లో నష్టపోయిన ప్రతి బాధితుడిని న్యాయం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం స్పందించారు. ఎక్కడ స్థలం ఉన్న ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని అన్నారు. స్థలాన్ని మోసపూరితంగా అమ్మిన వారు జైల్లో ఉంటారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 12:56 PM IST

కలెక్టర్‌పై విచారణ జరపాలి: అమర్నాథ్

AP: అనకాపల్లి కలెక్టర్‌పై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. ఆలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరగాలని, కన్యకాపరమేశ్వరి భూములపై పోరాడుతామని హెచ్చరించారు.

February 27, 2026 / 12:55 PM IST

శ్రీ పంచకం పోస్టల్ ఆవిష్కరణ

AKP: అనకాపల్లి బీజేపీ కార్యాలయంలో స్త్రీ పంచకం కార్యక్రమ పోస్టర్లు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 6 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందులో మహిళా జనరల్ సెక్రటరీ రోహిణి తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 12:53 PM IST

రేపటి నుంచి స్వచ్ఛ రథంపై అవగాహన

KDP: సింహాద్రిపురం మండలంలోని గ్రామాల్లో ఈ నెల 28వ తేదీ నుంచి నెల రోజులపాటు స్వచ్ఛ రథంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సింహాద్రిపురంలో స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తడి, పొడి చెత్తను సేకరించి ఇస్తే సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

February 27, 2026 / 12:51 PM IST

28వ వార్డులో చెట్ల కొమ్మల తొలగింపు

SRPT: కోదాడ పట్టణంలోని 28వ వార్డులో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను శుక్రవారం తొలగించారు. వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీను ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. విద్యుత్ అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కౌన్సిలర్ తెలిపారు. ఈ పనుల పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 12:51 PM IST

INDW vs AUSW: ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ప్రతీక రావల్(52), హర్మన్ ప్రీత్‌(54) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లు ఆష్లీ గార్డనర్, అలానా కింగ్, అన్నాబెల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆసీస్ టార్గెట్: 252.

February 27, 2026 / 12:51 PM IST

ఫోటో గ్రాఫర్ల భవనానికి ‘బోరు’ దాతగా మాజీ కౌన్సిలర్

దేవరకొండలో స్థానిక వీడియో, ఫోటో అసోసియేషన్ భవన అవసరాల కోసం 20వ వార్డు మాజీ కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి శ్రీశైలం యాదవ్ మంచినీటి బోరును వేయించి తన ఉదారతను చాటుకున్నారు. భవన నిర్మాణంలో ఎదురవుతున్న నీటి ఎద్దడిని గుర్తించిన ఆమె సొంత ఖర్చులతో బోరు వేయించి ఫోటోగ్రాఫర్లకు అండగా నిలిచారు. ​ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

February 27, 2026 / 12:49 PM IST

నేను ఇంకో ఓవర్ బౌలింగ్ చేయాలి: హార్దిక్

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్‌పై హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ‘బౌలింగ్ విషయానికి వస్తే, చాలా బాగుంది. నాకు కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఇష్టం. దేవుడి దయ వల్ల నా దగ్గర ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ చేసే నైపుణ్యం ఉంది. నేను దానిని నిజంగా ఆస్వాదిస్తాను. కానీ, నేను ఇంకా ఒక ఓవర్ బౌలింగ్ చేయాల్సింది. ఇక్కడి నుంచి వెళ్ళాక ఆ ఓవర్ వేస్తాను’ అని అన్నాడు.

February 27, 2026 / 12:49 PM IST

మీటర్ల ‘మాయాజాలం’.. రూ. 450 కోట్ల SCAM..?

HYD: నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్‌లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. రూ. 450 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.

February 27, 2026 / 12:49 PM IST

భూ రీ సర్వే విషయంలో ఘర్షణ.. కేసు నమోదు

ATP: పెద్దవడుగూరు మండలం కొండూరు సమీపంలో భూ రీ-సర్వే విషయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు రవ్వుకున్నారు. ఈ ఘటనలో రామన్న అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

February 27, 2026 / 12:45 PM IST

మహిళలు ఆర్థికంగా వ్యవస్థాయికి రావాలి : ఎమ్మెల్యే

MBNR: మహిళా సాధికారతపై సమాజాభివృద్ధికి పునాది అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. నా భారత్ ఆర్థిక సహకారంతో, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహబూబ్నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి గ్రామ దుకాణాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం జరుగుతుందని అన్నారు.

February 27, 2026 / 12:45 PM IST

బీఏసీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన వైసీపీ

AP: మండలి బీఏసీ సమావేశాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు బాయ్‌కాట్ చేశారు. లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైసీపీ MLCలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలి వాయిదా పడినా వైసీపీ సభ్యులు సభలోనే బైఠాయించారు. ఛైర్మన్ పోడియం ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.

February 27, 2026 / 12:44 PM IST

మంత్రిని కలిసిన పాతపట్నం ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్తూరులో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలని, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై నమోదైన కేసులను మానవతా దృష్టితో ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

February 27, 2026 / 12:44 PM IST

రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

PDPL: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్‌లో రామగుండం విద్యార్థులు సత్తా చాటారు. రామగుండం జపాన్ షిటోరియా కరాటే స్కూల్‌కు చెందిన ముక్తిశ్రీ 47 కేజీల విభాగంలో వెండి పతకం సాధించగా, 54 కేజీల విభాగంలో సహస్ర కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ కరాటే శ్రీనివాస్, సురేశ్,శ్రీనివాస్, శోభారాణి విజేతలను అభినందించారు.

February 27, 2026 / 12:43 PM IST

గుండెపోటుతో యువ సాఫ్ట్‌వేర్ మృతి

GDWL: రాజోలి గ్రామానికి చెందిన రాజేష్ గౌడ్ (32) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కష్టపడి పైకొచ్చిన రాజేష్ మరణ వార్త విని బంధుమిత్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

February 27, 2026 / 12:42 PM IST