• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

NZB: ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్‌గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ఛైర్​పర్సన్​, వైస్ ఛైర్మన్​లతో సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మినరల్స్ రాష్ట్ర ఛైర్మన్ ఈరవత్రి అనిల్, పాల్గొన్నారు.

February 26, 2026 / 01:16 PM IST

‘ఈనెల 21వ తేదీ లోపు కుటుంబ సర్వే పూర్తి చేయాలి’

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వేను ఈనెల 21వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 96,150 కుటుంబాలకు సర్వే నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు.

February 26, 2026 / 01:15 PM IST

మార్కాపురం ఆర్డీవోగా ప్రభాకర్

ప్రకాశం: మార్కాపురం రెవెన్యూ డివిజన్ (ఆర్డీవో)గా పెంచల ప్రభాకర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

February 26, 2026 / 01:15 PM IST

దుడ్డుకలులో సమ్మర్ క్రాష్ పనులు ప్రారంభం

PPM: దుడ్డుకలు నుంచి బీరుపాడు వరకు  గ్రామస్థులు సమ్మర్ క్రాష్ ప్రోగ్రాంను ఇవాళ MPDO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. చేతి పంపుల మరమ్మతులు, పైపులైన్ పరిశీలన, నీటి వనరుల శుద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.

February 26, 2026 / 01:15 PM IST

ఎన్టీఆర్ సినిమాలో అక్కినేని అఖిల్?

జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ అతిథి పాత్ర చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ సన్నివేశంలో అఖిల్ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

February 26, 2026 / 01:15 PM IST

ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక హెల్ప్‌లైన్

VKB: TGBIE స్టూడెంట్స్ & పేరెంట్స్ కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు వంటి అంశాలపై మార్గదర్శనం, సందేహాలు నివృత్తి కోసం విద్యార్థులు కాల్ చేయవచ్చు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-24655027, IVR 9240205555. విద్యార్థులు అవసరమైన సాయం కోసం వెంటనే సంప్రదించవచ్చని సూచించారు.

February 26, 2026 / 01:14 PM IST

తెలుగు గంగ కాలువకు గండి

NDL: బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామ శివారులో ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువకు 4-5 బ్లాకుల మధ్య భారీ గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఇటీవలే సమీపంలో గండి పూడ్చినప్పటికీ మళ్లీ గండి పడటంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

February 26, 2026 / 01:13 PM IST

సూళ్లూరుపేటలో బాలికలకు అవగాహన

TPT: సూళ్లూరుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్ హాజరై ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ మోసాలు, వాటి నుంచి రక్షణ మార్గాలపై సూచనలు ఇచ్చారు. “గుడ్ టచ్–బ్యాడ్ టచ్”, వాహన భద్రత, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే శక్తి యాప్‌ గురించి వివరించారు.

February 26, 2026 / 01:12 PM IST

కనిగిరిలో 30% ఐఆర్ కోసం ఏటీపీఎఫ్ నిరసన

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు 30 శాతం ఇంటిరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కనిగిరిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్‌కు నేతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

February 26, 2026 / 01:10 PM IST

సుంకం టెండర్ రద్దు చేయాలని ధర్నా

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, చిన్న వ్యాపార సంఘం కార్యదర్శి తిమ్మప్ప మాట్లాడుతూ.. చిన్న వ్యాపారస్తుల కడుపు కొట్టే సుంకం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీని సుంకం గెజిట్ ప్రకారం వసూలు చేయాలన్నారు.

February 26, 2026 / 01:10 PM IST

సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి

AKP: నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పీ. షియాజ్ ఖాన్ గురువారం స్థానిక సబ్ జైలు‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలకు అందుతున్న ఆహారాన్ని తనిఖీచేసారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలు పట్ల ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖైదీలు ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకుంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

February 26, 2026 / 01:10 PM IST

‘వైసీపీ వాళ్లు 420 కాబట్టే నెయ్యిని 320కి కొన్నారు’

AP: తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాపై బాధ్యతగా ఉండాలని, అవసరమైతే టాటా, రిలయన్స్ సంస్థల సహకారం తీసుకోవాలని బీజేపీ MLC సోము వీర్రాజ్ సూచించారు. ‘వైసీపీ వాళ్లు 420 కాబట్టే నెయ్యిని 320కి కొన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో రూ.2 వేల వరకు ఉంటుంది. లడ్డూలో వాడేది అసలు నెయ్యి కాదు. తిరుమలలోనే కాదు అన్ని ఆలయాల్లోనూ.. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ తయారు చేయాలి’ అని పేర్కొన్నారు.

February 26, 2026 / 01:09 PM IST

కుమారుడు పెళ్ళికి రావాలని KLRకు ఆహ్వాన పత్రిక ఇచ్చిన Dy.CM

RR: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మా రెడ్డి నివాసానికి వచ్చారు. ఈనెల 5న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి రావాలని కేఎల్‌ఆర్ దంపతులను ఆహ్వానించారు. కాసేపు నియోజకవర్గ అభివృద్ధిపై  ముచ్చటించారు.

February 26, 2026 / 01:09 PM IST

లిక్కర్ స్కామ్‌లో ఎంతటివారైనా అరెస్ట్ చేయాలి: మాధవ్

AP: మద్యం కేసులో నిందితులను శిక్షించాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ పేర్కొన్నారు. స్కామ్‌లో ఎంతటివారైనా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో 200 ఆలయాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అన్యమతస్తులకు తిరుమలలో భూములు కేటాయించారని తెలిపారు. లడ్డూ కల్తీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు.

February 26, 2026 / 01:07 PM IST

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

కామారెడ్డి పట్టణంలోని పలు ఇంటర్ పరీక్షా కేంద్రాలను SP రాజేశ్ చంద్ర పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు.

February 26, 2026 / 01:07 PM IST