AP: మద్యం కేసులో నిందితులను శిక్షించాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ పేర్కొన్నారు. స్కామ్లో ఎంతటివారైనా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో 200 ఆలయాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అన్యమతస్తులకు తిరుమలలో భూములు కేటాయించారని తెలిపారు. లడ్డూ కల్తీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు.