నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో రాబోతున్న ‘బ్లడీ రోమియో’పై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం కోసం ముగ్గురు సంగీత దర్శకులను తీసుకోవాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడట. యాక్షన్, రోమాన్స్, డ్రామా ఎమోషన్స్కు తగ్గట్టుగా ఒక్కో విభాగానికి ఒక్కో స్పెషలిస్ట్ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్లోనే ఇలా మల్టీపుల్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం విశేషం.
JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవాళ గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ధర్మకర్తలు చెన్నమనేని విష్ణువర్ధన్, వంశీవర్ధన్ ఆధ్వర్యంలో ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు మరింగంటి రామకృష్ణాచార్యులు తెలిపారు. ఈరోజు నుంచి మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయి.
NLG: అఖిల భారత బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షులు రామావత్ భీమా నాయక్ 9వ వర్ధంతి సందర్భంగా దేవరకొండలోని బంజారా భవనంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని భీమా నాయక్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారా సమాజం కోసం భీమా నాయక్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.
MHBD: రైన్య తండా గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతుల మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. పంట పక్వానికి వచ్చే సమయంలో భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం కారణంగా మొక్కలు నేలకు ఒరిగిపోయాయి. చాలా చోట్ల నీరు నిలిచి పంట మునిగిపోయింది. రైతులు పంట నష్టం భరించలేక ఆందోళన చెందుతున్నారు
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారు సింహ ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి ఉత్సవ మూర్తిని యోగ నారాయణస్వామి రూపంలో అర్చకులు అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత సింహ వాహనంపై శ్రీవారిని కొలువుదిర్చి పురవీధుల్లో ఊరేగించారు.
AKP: యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెదపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీవిశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. రేజేటి శ్రీరామాచార్యులు చేతుల మీదుగా వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. సంప్రోక్షణ, జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం నిర్వహించి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు.
AP: విశాఖలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధురవాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఫిజియోథెరఫీ సెకండ్ ఇయర్ చదువుతున్న రజిని అనే విద్యార్థిని ప్రేమించిన యువకుడు వదిలేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. ‘మమ్మీ డాడీ నన్ను క్షమించండి.. అతన్ని మర్చిపోలేకపోతున్నా’ అంటూ లెటర్లో పేర్కొంది.
NLR: నెల్లూరు మేయర్ ఎన్నికకు YCP కార్పొరేటర్లు దూరమయ్యారు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలతోనే కౌన్సిల్ సమావేశానికి ఎవరు హాజరు కాలేదని సమాచారం. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరుకు గురువారం జగన్ వచ్చారు. కార్పోరేటర్లు అందరూ ఆయన వద్దకు వెళ్లారు. మరోవైపు టీడీపీ కార్పొరేటర్ అందరూ సమావేశానికి వచ్చారు.
VKB: దాదాపూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల తోకని శ్రీనివాస్, దేశ రక్షణలో అమరుడైనందున ఆయనకు అంకితంగా “వీర జవాన్” విగ్రహాన్ని రేపు ఉదయం 11:30 గంటలకు దోమ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రత్యేకంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దోమ సర్పంచ్ శివకుమార్ పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, గ్రామస్థులు ఘనంగా హాజరుకావాలని ఆహ్వానించారు.
WNP: జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు రెవెన్యూ అదనపు కలెక్టర్గా సేవలందించిన ఆయనను, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా కేటాయించింది. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాలనను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పు చేపట్టింది. త్వరలోనే తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.
GDWL: ధరూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ ధరూర్ పాఠశాలలో హెడ్మాస్టర్ ప్రతాప్ రెడ్డి ఫిజికల్ సైన్స్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ఆయన ఉపాధ్యాయుల సమిష్టి కృషి విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఫిజికల్ సైన్స్ బోధనలో నాణ్యత పెంచేందుకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు ప్రశంసించారు.
HYD: నిత్యం వేలాది మంది పేషెంట్లు, సహాయకులు, సందర్శకులు వచ్చే గాంధీ ఆస్పత్రి ఓపి బ్లాక్ వద్ద క్యాంటీన్ లేకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న క్యాంటీన్ 2 నెలల క్రితం కోర్టు ఆదేశాలతో మూతపడింది. దాంతో ఓపీ బ్లాక్ ఆవరణలో కనీసం టీ, టిఫిన్, నీరు కరవైంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు రోడ్డు దాటి బయటకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.
MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో మహిళా సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వ్యాయాయంతో నిర్మించనున్న సమావేశ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.
శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.