KRNL: జిల్లాలో దళితులపై దాడులు తీవ్రతరం అయ్యాయని BSS రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ ఇవాళ అన్నారు. ప్రశ్నించే గొంతును అణిచే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. SC, ST అఘాయిత్యాల నిరోధక చట్టం 1989 కింద నమోదైన కేసుల్లో వేగవంతమైన విచారణ కోసం కర్నూలులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కృష్ణా: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ హనుమంతు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐలు ఖాదర్ బాషా, మొహమ్మద్ సలాహుద్దీన్లను శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
MDCL: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గాజులరామారం, మాధవ నగర్ సహా అనేక ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించారు. పలుచోట్ల బ్యానర్లు ఏర్పాటు చేసిన అధికారులు, చెత్త వేస్తే, మీ ఫోటోను బ్యానర్ల పై ముద్రించి, వాట్సప్ గ్రూపులలో షేర్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రూ.1000 జరిమానా సైతం విధిస్తామని రాసుకోచ్చారు.
CTR: కాణిపాకం ఆలయ పాలకమండలి సమావేశం శనివారం నిర్వహించారు. కాణిపాకం పట్నం వద్ద రహదారి నిర్మాణానికి 18 ఎకరాల భూమిని కేటాయించేలా కేబినెట్లో తీర్మానం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. గోశాల నిర్వహణకు నూతన భూమి కొనుగోలుకు, రానున్న ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఖర్చులు, దేశంలో భక్తుల సౌకర్యాలపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఛైర్మన్ మనినాయుడు ఉన్నారు.
GNTR: కాకుమాను పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బత్తుల హరికృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన శనివారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ను మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైని ఎస్పీ అభినందించారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.
TPT: సత్యవేడు పట్టణంలోని శ్రీమాతంగిశ్వరస్వామి ఆలయాన్ని టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం దాత కృష్ణయ్య యాదవ్ రూ.50 వేల చెక్కును శంకర్ రెడ్డి చేతుల మీదుగా అర్చకులకు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
GNTR: స్వచ్ఛ సర్వేక్షణ 2025-26లో భాగంగా పొన్నూరు మున్సిపాలిటీలో 31 వార్డులకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. పట్టణానికి ఉన్నత ర్యాంకు సాధించడమే లక్ష్యంగా శనివారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్తో సమన్వయం చేసుకుంటూ వార్డుల్లో పరిశుభ్రత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
NTR: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కృష్ణానదిలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సుమారు 35–40 ఏళ్ల వయస్సు కలిగినవాడిగా, ఒంటిపై బనియన్ మాత్రమే ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాదిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రమాదంలో మృతి చెందిన 44 కుటుంబాల వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబానికి రూ.3 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటాం అంటూ భరోసా కల్పించారు.
ప్రకాశం: యర్రగొండపాలెం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన పొలాలకు సమీపంలోని నీటికుంట వద్దకు పెద్దపులి వస్తుందని స్థానికులు తెలిపారు. పులి పాదముద్రలను గుర్తించిన రైతులు, పొలాలకు వెళ్ళేందుకు ప్రాణభయంతో హడలి పోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
NDL: బేతంచెర్ల(మం) వేగం కన్న ప్రాణం ముఖ్యమని బేతంచెర్ల సీఐ డీ. వెంకటేశ్వరరావు, ఎస్సై రమేష్ బాబు అన్నారు. శనివారం బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో ఆటోడ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వాహనానికి సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ చుట్టుగుంటలో ఉన్న ఎస్.కే.బి.యం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. మార్కులు మాత్రమే భవిష్యత్తును నిర్ణయించవని తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో రేపటి (మార్చి 1) నుంచి నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందనీ ఎస్పీ నరసింహ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదనీ అన్నారు. బాణాసంచా, DJలు నిషేధం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు.
KMM: మోడీ పాలనలో దేశానికి ప్రమాదం ఏర్పడిందని సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. శనివారం ఖమ్మం బోసుబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ బహిరంగ సభకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం దివాళా తీయిస్తోందని పేర్కొన్నారు.