మహిళల రక్షణ, సమానత్వం, సాధికారత కోసం చాలా చట్టాలు ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకుని తమను తాము రక్షించుకోవాలి. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని చట్టాలు మీకోసం.. గృహ హింస నిరోధక చట్టం 2005 (BNS 85), పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం 2013, వరకట్న నిషేధ చట్టం 1961(BNS 80), సమాన వేతన చట్టం 1976, IPC 354(BNS 74), 376(BNS 63, 64), 509(BNS 78).
PDPL: 14 సం. నిండిన బాలికలకు మార్చి 8న జిల్లా ఆసుపత్రితో పాటు రామగుండం జనరల్ ఆసుపత్రి, మంథని, సుల్తానాబాద్ CHCలలో HPV వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సంబంధిత వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ తోడ్పడుతుందన్నారు.
E.G: మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ ఎన్టీఆర్ పురస్కారాన్ని చిరంజీవికి అందించడం ఆనందదాయకమన్నారు. చిరంజీవి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలన్నారు.
NDL: ఆత్మకూరులోని MPDO కార్యాలయం వద్ద స్వచ్ఛ రథం సేవా కార్యక్రమాలను MPP నల్ల కాలువ తిరుపాలమ్మ, MPDO నాగేంద్రుడు, డిప్యూటీ ఎంపీడీవో బాలు నాయక్ నిన్న ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛ రథం ద్వారా నిత్యవసర సరుకులు, వివిధ రకాల కూరగాయలను అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని MPDO అన్నారు. స్వచ్ఛ రథం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నెల్లూరు నుంచి గూడూరు మధ్య రామేశ్వరం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. జనరల్ బోగీలోని ఒక బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తెరిచి పరిశీలించారు. అందులో 9 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి నిందితుడు పరారయ్యాడని రైల్వే డీఎస్సీ మురళీధర్ తెలిపారు.
PPM: ప్రభుత్వానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు, కోర్టు కేసుల పరిష్కారంలో నిర్దేశిత గడువులోగా అదికారులు కౌంటర్లు దాఖలు చేయాలని JC యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి నెల కేసుల స్థితిగతులపై నివేదికలను అప్డేట్ చేయాలని, జాబ్ చార్ట్ ప్రకారం విధుల నిర్వహణ ఉండాలన్నారు.
SKLM: సంతబొమ్మాళి మండలం ములపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని మాజీ మంత్రులు ఏఎస్పీ రమణకు వినతి పత్రం సమర్పించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీకు మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అప్పలరాజు కలిసి పనులు ఎంతవరకు జరిగాయో చూస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 80 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు.
ATP: అమరావతిలోని తన నివాసంలో నంద్యాలకు చెందిన నరసింహులుకు రూ. 1.05 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితుడికి ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
KRNL: హొళగుంద మండలం హెబ్బటంలో ఇవాళ నిర్వహించనున్న కనక శ్రీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆలూరు MLA విరుపాక్షి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు గ్రామానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారని వైసీపీ మండల కన్వీనర్ షఫీ తెలిపారు. అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
వయసు పెరుగుతున్నా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్న ఆమె.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. షారుఖ్ఖాన్తో ‘జవాన్’, చిరంజీవితో ‘MSVPG’లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్కి జంటగా నటించనున్నట్లు టాక్. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాలి.
VZM: మెరకముడిదాం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నేడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.భాస్కర్ రావు శనివారం ప్రకటన చేశారు. ఎంపీపీ తాడ్డి కృష్ణవేణి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు హాజరవుతున్నారని, అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో హాజరుకావాలని ఆయన కోరారు.
NRML: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో 5కే రన్ నిర్వహించనున్నామని మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ తెలిపారు. సోమవారం ఉదయం 6:00 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కొమరం భీమ్ చౌరస్తా వరకు, మళ్లీ రిటర్న్ గవర్నమెంట్ కాలేజ్ వరకు 5 K రన్ మున్సిపాలిటీ కార్యాలయం ఆధ్వర్యంలో ఉంటుందని, అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.
HYD: రంజాన్ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్ని మసీదుల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ వెల్లడించారు. నిన్న జహనుమాలో ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు.
MDK: కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, ఎలక్షన్ సూపరింటెండెంట్ గఫర్, ఎన్నికల సిబ్బందితో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాంను పరిశీలించారు.
SKLM: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ ఉ. 9 గంటలకు కోటబొమ్మాళిలో ఆలయం ప్రతిష్టలో, ఉ.10 గంటలకు టెక్కలిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ. 11.30కు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభిస్తారు. సా.5.30కు టెక్కలిలో ఓ ఇంజనీరింగ్ కళాశాల వార్శికోత్సవంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపారు.