• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

DGP ఎదుట లొంగిపోనున్న మావోయిస్టులు

TG: నలుగురు కీలక అగ్రనేతలు సహా 40మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నారు. దేవ్‌జి అలియాస్ తిప్పిరీ తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహ రెడ్డి జన జీవన స్రవంతిలో కలవనున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రెటరీగా ఉన్న దేవుజి కూడా లొంగిపోనుండడంతో మావోయిస్టు రహితంగా రాష్ట్రంగా మారనున్నట్లు సమాచారం.

February 24, 2026 / 03:00 PM IST

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: ఎస్సై

NZB: వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి మంగళవారం సూచించారు. ‘అరైవ్ అలైవ్’ రెండో విడతలో భాగంగా షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే ప్రచారం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. భద్రతపై అవగాహన ప్రతి పౌరుడికి చేరాలని ఎస్సై కోరారు.

February 24, 2026 / 03:00 PM IST

కారును తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు

ప్రకాశం: కంభంలో రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్కార్పియో కారును మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. కంభంలోని తన నివాసంలో సమయంలో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగిన విషయాన్ని గుర్తించి మంటలను ఆర్పి వేసినట్లు రాజేశ్వర్ రెడ్డి తెలిపాడు. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తన ఇంటి ఆవరణలోకి ప్రవేశించి కారును తగలబెట్టారన్నారు.

February 24, 2026 / 03:00 PM IST

పుట్టపర్తిలో సచ్చిదానంద ప్రసాద్‌కు ఘన స్వాగతం

సత్యసాయి: పుట్టపర్తికి చేరుకున్న పీఎంశ్రీ పాఠశాలల కేంద్ర కమిషనర్ సచ్చిదానంద ప్రసాద్‌కు ఘన స్వాగతం లభించింది. ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహం వద్ద ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జేసీ కేంద్ర కమిషనర్‌కు మొక్కను అందజేసి పర్యావరణ హితంగా స్వాగతం పలికారు.

February 24, 2026 / 03:00 PM IST

జట్టులో ఈ మార్పులు చేయాలి: పఠాన్

జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితో సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు కీలక సూచనలు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్నాడు. అలాగే, అక్షర్‌ను జట్టులోకి తీసుకోవాలని కోరాడు. జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే సరిపోతుందని తెలిపాడు.

February 24, 2026 / 02:58 PM IST

పీహెచ్సీని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

KNR: శంకరపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో చందు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. గద్దపాకకు చెందిన గర్భిణి ప్రసవం కోసం రావడంతో ఆమెకు మనోధైర్యం కల్పించి, మెరుగైన సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యాధికారులు డా. శ్రావణి పాల్గొన్నారు.

February 24, 2026 / 02:56 PM IST

అంబటిపై దాడిని ఖండిస్తున్నా: మాజీమంత్రి

AP: అంబటి రాంబాబుపై దాడిని ఖండిస్తున్నట్లు మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. అంబటి గొంతు నొక్కాలనుకోవడం అవివేకమని అన్నారు. అంబటి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. 

February 24, 2026 / 02:53 PM IST

‘యుద్ధ ప్రాతిపదికన వైద్యం అందించాలి’

SKLM: డయేరియా వ్యాధి గ్రస్తులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తిస్థాయి వైద్యం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. డయేరియా ప్రభలిన ప్రాంతాల్లో సీపీఎం బృందం మంగళవారం పర్యటించారు.

February 24, 2026 / 02:51 PM IST

రాజమండ్రిలో కొనసాగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష

E.G: రాజమండ్రిలో అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష శిబిరాన్ని CITU జిల్లా నాయకులు ఎస్.ఎస్ మూర్తి సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు, గ్రాడ్యుటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ లివ్, మే నేల అంత వేసవి సెలవులు ఇస్తూ GO విడుదల చేయాలన్నారు.

February 24, 2026 / 02:50 PM IST

ఆవు, గేదె పాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆవు, గేదె పాలపై రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ చేసిన వాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.’ ఆవు దూడ జ్ఞానవంతురాలు, కానీ గేదె దూడ మేధోపరంగా అవినీతిపరుడు’ అని అన్నారు. ‘పిల్లలు ఉత్సాహంగా ఉండాలంటే ఆవుపాలు, సోమరిగా ఉండాలంటే గేదె పాలు తాగించాలి’ అని తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

February 24, 2026 / 02:49 PM IST

‘పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి’

PPM: జిల్లాలో మార్చి 2వ తేదీ నుండి 13 వరకు జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సార్వత్రిక (ఓపెన్ స్కూల్) పరీక్షలకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా:ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలన్నారు.

February 24, 2026 / 02:49 PM IST

“సంఘటన సృజన అభియాన్” కార్యక్రమం

PDPL: మిర్జాపూర్లో ఇవాళ నిర్వహించిన ‘సంఘటన సృజన అభియాన్’ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన గ్రామస్థులతో సమావేశమయ్యారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

February 24, 2026 / 02:48 PM IST

గోవిందరావుపేటలో వరుస దొంగతనాలు.. ప్రజల్లో భయాందోళన

MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో గత 15 రోజుల్లో ఐదు చోట్ల దొంగతనాలు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. SC కాలనీలో బంగారు ఆభరణాలు, చికెన్ సెంటరులో నగదు అపహరణకు గురవ్వగా, సోమవారం రాత్రి ప్రధాన రహదారిపైన ఉన్న కిరాణా దుకాణంలో రూ. 50 వేల నగదు చోరీకి గురైంది. వరుస ఘటనలతో రాత్రి వేళల్లో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

February 24, 2026 / 02:46 PM IST

T20 WC: మరోసారి భారత్-పాక్ మ్యాచ్

ICC ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్‌తో తలపడనుంది. 17న నెదర్లాండ్స్‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. జూలై 5న లార్డ్స్ వేదికగా ఫైనల్ జరగనుంది.

February 24, 2026 / 02:45 PM IST

నూతన ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించిన మంత్రి

NGKL: కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో ప్రతి అర్హుడికి సొంత ఇంటి కల నిజం చేస్తామని, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.

February 24, 2026 / 02:45 PM IST