ప్రకాశం: బీసీవైఎం పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గురువారం కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక బీసీ సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై సంక్షిప్తంగా చర్చించినట్లు నాయకులు తెలిపారు.
SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, సూర్యాపేట నుంచి కోదాడ వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NRML: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక క్షేత్రస్థాయి అమలును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామునే స్థానిక కేజీబీవీ పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ మూవీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 14న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ పక్కాగా లాక్ అయినట్లు టాక్. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
SKLM: లావేరు మండలం గుర్రాలపాలెం పంచాయతీ పరిధిలోని రోడ్డు అధ్వానంగా తయారైంది. గుర్రాలపాలెం నుంచి బాణం, జి.సిగడాం, పొందూరు మండలాలకు వెళ్లే రోడ్డులో గత ఏడాది కిందట మెటల్ రాళ్లు వేసి వదిలేశారు. రోడ్డుపై రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తారు రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
NDL: శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో 10 రోజులవుతున్నా నీటి సరఫరా చేయకపోవడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పనులను సాకుగా చూపి అధికారుల నిర్లక్ష్యంతో నీటి సరఫరా చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాగేందుకు చుక్క నీరు లేదు కానీ రోడ్లకు క్యూరింగ్ చేసేందుకు ఫిల్టర్ హౌస్ నీటిని వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ATP: రజక జాతి చిన్నారి మౌనిక మృతికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం గుత్తి శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రజక సంఘం నాయకులు కిరణ్, సురేష్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మౌనికపై దాడి చేసి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
SKLM: ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు సర్పంచ్ పంచి రెడ్డి రాంబాబు చెక్ పవర్ను పలు ఆరోపణలతో 10 నెలల క్రితం అధికారులు రద్దు చేశారు. అయితే తన తప్పు లేదని జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో పదిసార్లు ఫిర్యాదు చేశారు. చివరకు హైకోర్టుని ఆశ్రయించగా చెక్ పవర్ పునరుద్ధరించాలని తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు అమలుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
TG: నిజామాబాద్(D) ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో దారుణం జరిగింది. మద్యం, గంజాయికి బానిసైన కుమారుడు భానుప్రకాష్ను తండ్రి కిషన్ గొడ్డలితో నరికి చంపాడు. కొడుకు వ్యసనాలతో విసిగిపోయిన తండ్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం కిషన్ నేరుగా ఇందల్వాయి PSకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
WGL: చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం శివారులో గురువారం ఉదయం పంటపొలాల్లో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదం లేదా హత్యన అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు, మృతుడు ఎవరో గుర్తించాల్సి ఉంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారులోని భీముని పాదం జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. పచ్చని అడవుల మధ్య కనువిందు చేస్తున్న ఈ ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. నర్సంపేట-గూడూరు ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు సరైన వేదికగా మారింది.
PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్లో గురువారం 65-70 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. బుకింగ్ కౌంటర్ వద్ద కూర్చుని ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించామని, మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
NTR: నందిగామ ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు గురువారం అంబారుపేట గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి జరుగుతున్న హౌస్ టాక్స్ వసూళ్లను స్వయంగా పరిశీలించారు. నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లలో ఇటీవల చిరుతపులి, ఎలుగుబంటికి సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇది జిల్లా అటవీ పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.