కోనసీమ: కాంగ్రెస్ నేతలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో ఆదివారం సాయంత్రం బీజేపీ యువమోర్చా అధ్యక్షులు గానాల కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి సృష్టించిన అల్లర్లను ఖండిస్తూ నిరసన చేపట్టామన్నారు.
చండీగఢ్లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్లో రూ.590 కోట్ల భారీ మోసం జరిగింది. హర్యానా ప్రభుత్వ విభాగాలకు చెందిన ఖాతాలో ఈ గోల్మాల్ చోటుచేసుకుంది. ఒక శాఖ తన ఖాతా క్లోజ్ చేయాలని కోరగా బ్యాలెన్స్లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. దీంతో హర్యానా ప్రభుత్వం ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇది కేవలం ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని సమాచారం.
KMR: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ అంశం మరింత జఠిలంగా మారడంతో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణల వరకు వెళ్లింది. తాజాగా ఈ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. మరోవైపు శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉభయసభలను కల్తీ నెయ్యి వ్యవహారం కుదిపేస్తుంది. శాసనసభకు వైసీపీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ పట్టుపట్టనుంది.
W.G: పోడూరు మండలం కొమ్ముచిక్కాల టీడీపీ క్యాంప్ కార్యాలయంలో రూ .23,16,107 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆచంట నియోజకవర్గంలో రూ. కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించామన్నారు.
ELR: విదేశాల్లో వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిలువునా ముంచిన ఘటన జంగారెడ్డిగూడెంలో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన షంషీర్ అహ్మద్ కుమార్తె, మేనల్లుడికి సీట్ల కోసం మహబూబ్ నగర్కు చెందిన గుండా రాఘవ రూ.19.50 లక్షలు వసూలు చేశాడు. పలుదఫాలుగా నగదు తీసుకొని సీట్లు ఇప్పించకుండా కాలయాపన చేయడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.
CTR: గంటవూరు సమీపంలోని శనీశ్వరాలయం వద్ద ఉన్న ఓ దుకాణంలో దొంగ బీభత్సం సృష్టించాడు. బైక్పై హెల్మెట్, మాస్కుతో వచ్చిన అగంతకుడు షాపులో సిగరెట్ కావాలని అడిగి, యజమాని జ్యోతి మెడలోని గొలుసు లాగేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో దొంగ ఆమె చెవిని తుంచి కమ్మలు, మాటీలు (14గ్రా) లాక్కెళ్లాడు. తీవ్ర రక్తశ్రావమైన బాధితురాలికి ఐదు కుట్లు పడ్డాయి.
KNR: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈనెల 24న జాబ్ మేళాను KNR ఉపాధి కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతి తెలిపారు. ఫ్లిప్ కార్ట్, ఈకార్ట్ KNR సంస్థలో 20 డెలివరీ బాయ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హతలు- 10వ తరగతి ఉత్తీర్ణులై, వయసు 18- 35 మధ్య ఉండాలన్నారు. నెలకు 22500, 30000 వరకు జీతం వస్తుందన్నారు.
ELR: ఇంటర్ విద్యార్థులకు SP ప్రతాప్ శివ కిషోర్ తీపి కబురు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి ఆలస్యం అవుతుంటే ఏలూరులోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పోలీసు వాహనాలు పరీక్షా కేంద్రానికి తరలించడానికి సిద్ధంగా ఉంటాయన్నారు.
PDPL: రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాదరావు తెలిపారు. 8 ఇంక్లైన్ సిర్కే బస్టాండ్ వద్ద రోడ్డు భద్రత నియమాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని, మద్యం సేవించి హనం వాహనాలు నడపవద్దని సూచించారు. పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
AKP: చీడికాడ మండలం మంచాల మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకటలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26లో 5వ తరగతి చదువుతున్న వారు అర్హులని పేర్కొన్నారు. మార్చి 31లోగా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించాలని కోరారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.
MLG: మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి శివారులోని కాలువలో పడి ఒడిశాకు చెందిన మిఠాలాల్ టండి (55) మృతి చెందాడు. ఇటుక బట్టీ పనుల కోసం ములుగుకు వచ్చిన ఆయన శనివారం వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం సాయంత్రం కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
WNP: మస్తిపురం ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై స్వాతి ఆదివారం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచిస్తూ, అందరితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
GDWL: జిల్లాలో విషాదం నెలకొంది. ఎర్రవల్లి మండలం బొచ్చు వెంగనపల్లెకు చెందిన అంజలి అనే చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందింది. హైదరాబాద్లో చదువుతున్న అంజలి, తల్లితో కలిసి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
NLG: చండూరులోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఆలయంలో హోమం, బలిహరణ, భేరి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మండపంలో పురోహితులు హరికిషన్ శర్మ, ప్రవీణ్ శర్మల ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.భక్తులు ఉత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు.