Varahi : జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహికి బుధవారం అంటే జనవరి 25న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. బుధవారం ఉదయం 8 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారాహి పూజలో భాగంగా ముందు ఆయన కనక దుర్గమ్మను దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారి సన్నిదానంలో వారాహికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు. ఇవాళ జగిత్యాల జిల్లాలోని క...
లక్నోలో ఓ ఐదంతస్తుల భవనం కూలింది. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వజీర్ హసన్ రోడ్లో గల బహుళ అంతస్తుల భవనం కూలగా, పక్కన గల భవనాలకు పగుళ్ల ఏర్పడ్డాయి. ‘భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని, చనిపోయిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్లారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సివిల్ ఆస్పత్రికి తరలించాం’ అని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ తె...
మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న భీమా నది తీరంలో విషాదం చోటు చేసుకుంది. భీమా నది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. భీమా నది తీరంలో మృతదేహాలు ఉన్నాయనే సమాచారం అందండంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. నది తీరంలో నాలుగు మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ఆ తర్వాత కొంత సేపటికి మరో మూడు మృతదేహాలు కనిపించాయి. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి...
పోలవరం వైసీసీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత స్టంట్ వేశారు. ఐసీయూ అబ్జర్వేషన్లో ఉంచారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్...
బాలీవుడ్ అనగానే ఆ ఇండస్ట్రీ రేంజ్ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడిప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా బాలీవుడ్ తో పోటీ పడుతోంది కానీ.. ఒకప్పుడు బాలీవుడ్ కు ఉన్నంత క్రేజ్ మరే ఇండస్ట్రీకి ఉండేది కాదు. ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో అయినా సరే సినిమా అంటే అది పాన్ ఇండియా లేవల్ లో వస్తోంది. టాలెంట్ ఉంటే.. సత్తా ఉంటే ప్రపంచం మొత్తాన్ని కూడా తమవైపునకు తిప్పుకోవచ్చు. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన ఓ కుర్రాడు.. ఏకంగా [...
అధికారం చేజిక్కించుకోవాలంటే యాత్ర చేపట్టాల్సిందేనని నేతలు విశ్వసిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రచార రథంతో కదం తొక్కారు. వైఎస్ఆర్ పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. రెండు దశాబ్దాల కింద వైఎస్ఆర్ చేపట్టిన యాత్రకు ఉమ్మడి రాష్ట్రంలో మంచి స్పందన వచ్చింది. 2003 ఏప్రిల్ 9వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు 68 రోజుల పాటు జనంతో ఉన్నారు. రంగారెడ్డి చేవెళ్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర 1500 కిలోమీటర్ల వరకు కొనసాగిం...
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రచార రథం వారాహికి పవన్ ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో మూడు ఆప్షన్లు తమకు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత కొండగట్టులో తొలిసారి వారాహి వాహనం ఎక్కి తన అభిమానులను, జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని బృందావనం రిస...
వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. పొంగులేటి పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో షర్మిలను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీతో పొంగులేటి అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ఇటీవల ఖమ్మం గుమ్మంలో జరిగిన ఆవిర్భావ సభకు కూడా హాజరుకాలేదు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో ఆయనకు పొసగడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల...
తిరుమల లడ్డూ కౌంటర్లో చోరీ జరిగింది. కార్పొరేషన్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజి ద్వారా అనుమానితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ కాంప్లెక్సులో రాజా కిషోర్ కౌంటర్ బాయ్గా చేరాడు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా నెలరోజుల క్రితం డ్యూడీలో జాయిన్ అయ్యాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో వర్...
RRR : ప్రస్తుతం ప్రపంచమంతా మన సినిమా ఆర్ఆర్ఆర్ గురించే చర్చించుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. తాజాగా ఆస్కార్ నామినేషన్ ను దక్కించుకుంది. 95 వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఈ సినిమా నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్ లో భారత్ కు చెందిన పది సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. ఆర్ఆర్ఆర్ సినిమా పాట నాటు నాటు పాట నామినేషన్స్ లో...
Balakrishna Controversy: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. తను నటించిన వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో ప్రసంగించిన బాలయ్య.. అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించడంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. వీరసింహారెడ్డి సూపర్ హిట్ అవడంతో ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించారు. విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. సెట్ లో నాన్న గారు డై...
అధికారం మారాలంటే నేతలు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు, హామీలు ఇవ్వడంతోపాటు జనంతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సీజన్ నడుస్తోంది. ఏపీలో వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, యువగళం పేరుతో నారా లోకేశ్,...
Adivi Sesh : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇంట్లో వేడుకలు ప్రారంభం అయ్యాయి. తన చెల్లి పెళ్లిని ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లిలో భాగంగా హల్దీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తన చెల్లెలు అడివి షిర్లీ పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులంతా వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ, నేను, నా చెల్లి ముగ్గురం హల్దీ వేడుకల్లో ఎంజాయ్ చేశాం....
జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తన ఏపీ యాత్ర కోసం ఉపయోగించే ఎన్నికల రథం వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. మూడు ఆప్షన్లలో ఒక ఆప్షన్ గా బీజ...
చంద్రముఖి మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలుసు. అందులో నాంద చంద్రముఖి అంటూ పలికే డైలాగ్ మూవీలో హైలెట్. ఢిల్లీ మెట్రో రైలులోకి చంద్రముఖి వచ్చింది. అంటే దెయ్యం కాదు లెండి.. చంద్రముఖి డ్రెస్, కళ్లకు కాటుక పెట్టుకొని ఓ యువతి వచ్చింది. అక్కడ ఉన్న వారిని భయపెట్టింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రాజస్తాన్లో గల భరత్పూర్కు చెందిన మహిళ లక్ష్మీ నివాస...