నెల్లూరు రూరల్ పోలీసులపై టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు తీసుకెళ్లిన టీచర్ను వదిలేసి, పట్టించిన వారిపై కేసులు పెట్టడం ఏంటీ అని అడిగారు. 2వ డివిజన్ గుడిపల్లిపాడులో నిన్న జరిగిన ఘటన గురించి వివరించారు. పిల్లలకు పెట్టాల్సిన కోడిగుడ్లను ప్రధానోపాధ్యాయురాలు ఇంటికి తీసుకెళ్తుండగా గ్రామస్తురాలు నాగభూషణమ్మ పట్టుకున్నారు. పట్టుకున్న ఆమెను పోలీస...
అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పులకుప్పలా మారిన గ్రూప్ కంపెనీల ఆర్థిక సత్తాపై అమెరికాకు చెందిన హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోను మోసం చేస్తోందని ఆ అమెరికా సంస్థ ఆరోపించింది. అదానీ ఎంటర్ ప్రైజేస్ త్వరలో రూ.20,000 కోట్ల మలిదశ ఐపీవో జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు గమనార్హం. ఈ రీసెర్చ్ నేపథ్యంలో ...
గణతంత్ర వేడుకల వేదికను రాజకీయం చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గవర్నర్ తమిలసాయి, ముఖ్యమంత్రి కేసిఆర్ మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక చూసుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రాద్ధాంతం సరికాదని, ప్రభుత్వం వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్...
రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొన్న వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. https://twitter.com/i/status/1618455125399588864 గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శ...
ఆఫ్ఘనిస్తాన్ లో చలిగాలుల తీవ్రత ఎక్కువవుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 157 మంది చలిగాలులకు తట్టుకోలేక మరణించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మరణాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి తీవ్ర విచారం వ్యక్తి చేసింది. ఆఫ్ఘన్ లో వాతావరణం మరీ చల్లబడిపోయిందని, మైనస్ 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు వాతా...
తెలుగువారికి పద్మ అవార్డుల పైన టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మ అవార్డులు సాధించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగువారి కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. పద్మ అవార్డులు సాధించిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఎందరో తెలుగువారి అద్భుతమైన కృషిని గుర్తించడం తనకు చాలా సంతోషాన్ని కల...
యావత్ దేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే ఉమ్మడిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. భారతీయులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ… స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో నేటి గణతంత్ర దినోత్సవం విశిష్టమ...
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యనే టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు ఈ.రామదాస్ కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన డైరెక్టర్ గానే కాకుండా పలు సినిమాల్లో ఆర్టిస్టుగా కూడా చేశాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చూలైమేడుల...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు మాత్రం దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టికెట్లు గలవారికి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 69,221 మంది దర్శించుకున్నారు. అలాగే ...
హైదరాబాద్లోని రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైద...
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్, ఏఎన్ఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవాళ్ళు తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఎస్వీఆర్ మనవాళ్ళు కూడా స్పందించారు. అయితే వీరు బాలకృష్ణ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు, రాద్ధాంతం అవసరం లేదు అన్నారు. బాలకృష్ణ చేసిన వి...
నేడు వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదువుల తల్లి సరస్వతి దేవిని స్తుతించే పవిత్రదినం కావడంతో బాసరలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. తెల్లవారుజాము నుంచే పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిక...
పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు ని...
మార్కెట్ అంటే బండి నుంచి మొదలు సూపర్ మార్కెట్ వరకు ఉంటాయి. కొందరు సైకిళ్ల మీద తిరిగి విక్రయిస్తుంటారు. టూరిస్ట్ స్పాట్ థాయ్లాండ్లో మాత్రం వెరైటీ మార్కెట్ ఉంది. అవును రైల్వే ట్రాక్ పక్కన్ ఉండటమే విశేషం. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను ఓ సారి చూడండి. థాయ్లాండ్లో ఫేమస్ మెక్లాంగ్ రైల్వేస్టేషన్. ఇది సముత్ సాంగ్ఖ్రామ్ ప్రావిన్స్లో ఉంది....
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం మొత్తం 106 పద్మ అవార్డులు ప్రకటించింది. ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ...