AP: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో కల్తీ నెయ్యిపై చర్చించనున్నారు. అలాగే, బడ్జెట్లో శాఖలవారీగా డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరగనుంది. ఆయా శాఖల డిమాండ్ల ఆమోదం కోసం సభలో ప్రతిపాదించనున్నారు. శాసనమండలిలో శాంతిభద్రతల అంశంపై చర్చించనున్నారు.
KDP: కందిమల్లయపల్లిలోని జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలో నూతన మఠాధిపతుల పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి దర్శనం నిర్వహించగా, పూర్వపు మఠాధిపతి చిత్రపటానికి నూతన మఠాధిపతులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై మహోత్సవంలో పాల్గొన్నారు.
SKLM: నాగావళి నది తీరాన కొలువై ఉన్న శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని ఈవో సుకన్య ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయానికి రూ.2,38,567 ఆదాయం లభించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయినిపేటకి చెందిన నాగజయంతిని అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు. నాగ జయంతిని నొస్సం గ్రామానికి చెందిన గాదంశెట్టి వెంకటరాముడుకి ఇచ్చి వివాహం చేయగా, కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పుట్టింటికి చేరుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇవాళ కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
NRPT: డా.బీఆర్.అంబేద్కర్ యువజన సంఘం నేతలు మక్తల్లో నిరసన చేశారు. కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకులం చాకలి కుటుంబంపై దాడి చేసి 2 నెలల పసిపాపను చంపారని మండిపడ్డారు. కులవాదులపై కఠిన చర్యలుతీసుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. తర్వాత చిన్నారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ (కొత్తది)లో ఫిబ్రవరి 24న ఉదయం 11 గంటలకు అపోలో ఫార్మసీ ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. SSC, D/B/M.Pharm అర్హత గల 18-35 ఏళ్ల అభ్యర్థులు 100 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్తో హాజరుకావాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ తెలిపారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో కదిరి యువకుడు చరణ్కుమార్కు బెంగళూరులోని వైదేహీ ఆసుపత్రిలో గుండె మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి నుంచి గుండెను సేకరించి డా.దుర్గాప్రసాద్రెడ్డి వైద్య బృందం చరణ్కు అమర్చారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి ప్రతినిధి హారీశ్ బాబు తెలిపారు.
BDK: బూర్గంపాడు పోలీసులు ఇద్దరు ఎస్సైలపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. గతంలో భద్రాచలం టౌన్ ఎస్సైగా పనిచేసిన మహేష్, అతని తమ్ముడు ఎస్సై రాణాప్రతాప్పై ఈ చర్య తీసుకున్నారు. వ్యాపారం పేరుతో 35 శాతం అధికంగా చెల్లిస్తామంటూ కుమారి అనే మహిళ వద్ద రూ. 1.82 కోట్ల మొత్తం తీసుకుని మోసగించారనే అభియోగంపై ఆ ఇద్దరిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శరీర బరువు కారణంగా తాను ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో నటి మృణాల్ ఠాకూర్ చెప్పింది. ‘నాకు ఇంకా ఆ రోజులు గుర్తున్నాయి. ఏడుస్తూ నిద్రపోయి.. ఉబ్బిన కళ్లలో మేల్కొన్న రోజులు ఉన్నాయి. శరీరాకృతి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనుకునేదాన్ని. దాన్ని అధిగమించడానికి చాలా ధైర్యం కావాలి. అప్పుడే అర్థమైంది.. మనం ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు నచ్చుతాం’ అని పేర్కొంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 694.13 పాయింట్లు నష్టపోయి 82600.53 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 201.90 పాయింట్ల నష్టంతో 25511.10 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.96గా ఉంది.
HNK: ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కజ్ ప్రభుత్వ పాఠశాలలో నిన్న సాయంత్రం బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో రూ. 8 లక్షల విలువచేసే 20 లాప్టాప్లు విద్యార్థులకు అందించినట్లు పేర్కొన్నారు.
TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. పూరిళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఖాళీ చేసేందుకు స్థానికులు గడువు కోరుతున్నారు. కాగా, భూదాన్ భూవివాదం కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తోంది. 31 ఎకరాల్లో స్థానికులు పూరిళ్లు వేసుకున్నారు.
NRML: రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆయా ప్రైవేట్ కళాశాలలు హాల్ టికెట్లు జారీ చేయడంలో ఇబ్బందులకు గురి చేస్తే విద్యార్థులు నెట్ నుండి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరు కావచ్చని డీఐఈఓ పరుశురాం నేటి ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే విద్యార్థుల మొబైల్ ఫోన్లకు హాల్ టికెట్ లింకును పంపించామని తెలిపారు.
NTR: జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం కింద నిర్మించిన గోశాలను (కమ్యూనిటీ గోకులం) ను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.రూ.10 లక్షలతో నిర్మించిన గోశాల గ్రామంలోని పాలు ఉత్పత్తి చేసే రైతులకు మేలుకలుగుతుందని, పశుసంవర్థక రంగం అభివృద్ధికి తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు.