• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

48 గంటల్లోనే దొంగతనం కేసు ఛేదన.. అభినందించిన ఎస్పీ

KMR: ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామంలో జరిగిన భారీ దొంగతనం కేసును ఎల్లారెడ్డి పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో ఇనుప పెట్టెలో దాచిన సుమారు 40 తులాల వెండి ఆభరణాలు, 6 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.16 లక్షల నగదును దొంగిలించిన కిలాడీ దొంగల జంటను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

February 23, 2026 / 08:30 PM IST

శంకరపట్నం మండల కేంద్రంలో ధర్నా

KNR: నాగర్ కర్నూల్లోని కొమ్మెర గ్రామంలో రజక కుటుంబానికి చెందిన ఓ పసికందు మృతికి నిరసనగా శంకరపట్నం మండల కేంద్రంలో రజక సంఘం, బీసీ సంఘాల ధర్నా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిన్నారి మృతికి కారణమైన అగ్రకుల నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్ర వర్ణాల ఆగడాలను ఖండించారు. బీసీ సంఘం, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

February 23, 2026 / 08:29 PM IST

డా.నమ్రతకు 2 రోజుల కస్టడీ

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సరోగసీ పేరుతో శిశు విక్రయాలు జరిపిన కేసులో సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రతకు కోర్టు 2 రోజుల కస్టడీ విధించింది. నమ్రతను ఈడీ 5 రోజుల కస్టడీ కోరగా.. నాంపల్లి కోర్టు రెండు రోజులకు అనుమతించింది.

February 23, 2026 / 08:28 PM IST

అధికారులు స్పందించారు.. మురుగు తొలగించారు

తూ.గో: రాజమండ్రి ఆవ వాంబే కాలనీలో పేరుకుపోయిన పారిశుద్ధ్య సమస్యను ఆర్ఎమ్‌సీ అధికారులు సోమవారం పరిష్కరించారు. డ్రైనేజీలు పూడికతో నిండి మురుగు నిలిచిపోవడంతో, స్థానికులు ‘జనతా వారధి’ వేదికలో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన అధికారులు జేసీబీలతో మురుగును తొలగించి శుభ్రం చేశారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 08:28 PM IST

‘జాతీయ స్థాయిలోనూ రాణించాలి’

WGL: సైబరాబాద్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలు సాధించిన వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీ సన్ ప్రీత్ సింగ్ క్రీడాకారులను అభినందించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పతకాలు సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించగలమన్నారు.

February 23, 2026 / 08:28 PM IST

‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఓటీటీ డేట్ ఫిక్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. జనవరి 30న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 4 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. కోపిష్టి ఓంకార్(తరుణ్), స్వేచ్ఛ కోరుకునే ప్రశాంతి(ఈషా)ల పెళ్లి తర్వాత వారి జీవితాల్లో ఎదురైన నాటకీయ పరిణామాల సమాహారమే ఈ మూవీ కథ.

February 23, 2026 / 08:28 PM IST

‘స్టేషన్ చుట్టూ తిరగకుండా చూడాలి’

PPM: ఫిర్యాదు చేసిన వ్యక్తి పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. మొత్తం తొమ్మిది పిర్యాదులు వచ్చాయన్నారు.

February 23, 2026 / 08:27 PM IST

రేపు మహమ్మదాపూర్‌కు మంత్రి రాక

WNP: మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు పాల్గల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.

February 23, 2026 / 08:24 PM IST

వీరభద్ర స్వామికి భక్తుల పవళింపు సేవ

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి దేవత మూర్తులకు అర్చకులు పవళింపుసేవ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్‌తో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:21 PM IST

‘పరిహారం పెంచి ఇవ్వాలి’

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో 2016లో తీసుకున్న భూములకు రేటు పెంచాలని మత్యకారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నక్కపల్లిలో నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణను కలిసి వినతిపత్రం అందజేశారు. అప్పుడు ఎకరం రూ.18 లక్షల మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రేట్ల ప్రకారం రూ.32 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని వారికి తెలిపారు.

February 23, 2026 / 08:21 PM IST

RTCకి కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు

TG: TGRTCకి ఒలెక్ట్రా సంస్థ 1,085 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయనుంది. పీఎం ఈ-డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ-బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు టీజీఎస్‌ ఆర్టీసీ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేసింది.

February 23, 2026 / 08:20 PM IST

25న గుంటూరుకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్

GNTR: ఏపీ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఈనెల 25న గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక క్యాత్ ల్యాబ్, కార్డియాక్ OTలను ప్రారంభించి, అనంతరం కాలేజీ 22వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

February 23, 2026 / 08:20 PM IST

నానో ఎరువులపై రైతులకు అవగాహన

JGL: రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, ప్రకృతి వ్యవసాయం నానో ఎరువుల వినియోగంపై సోమవారం మండలంలోని ఎల్లాపూర్ రైతు వేదికలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ధర్మపురి, పెగడపల్లి ఏవోలు రాజకుమార్ శ్రీకాంత్ పాల్గొని సహజ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా భూసారాన్ని మెరుగుపరచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు.

February 23, 2026 / 08:19 PM IST

ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ చేసిన కలెక్టర్

W.G: ఉండి మండలం మహాదేవ పట్నం హైస్కూల్‌లో జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్ సోమవారం పంపిణీ చేశారు. పూర్వపు విద్యార్థి,దాత అల్లూరి రామకృష్ణంరాజును ఆమె అభినందించారు. జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ జుత్తిగ నాగరాజు, జిల్లా D.E.O. నారాయణ, సమగ్ర శిక్ష A.P.C.శ్యాం సుందర్, H.M. ఎం.జాన్ బాబు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:19 PM IST

ఆటో లైన్ వివాదం పలువురిపై కేసులు

KRNL: ఎమ్మిగనూరు ఆటోలు లైన్లో పెట్టుకునే విషయంలో హనుమాపురానికి చెందిన నవీన్, రామాంజి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణగా మారి పరస్పరం దాడులు, ఆటోల అద్దాల ధ్వంసానికి దారితీసింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు 14 మందిపై కేసునమోదు చేసినట్లు SI నిరంజన్ రెడ్డి తెలిపారు.

February 23, 2026 / 08:18 PM IST