GNTR: ఏపీ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఈనెల 25న గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక క్యాత్ ల్యాబ్, కార్డియాక్ OTలను ప్రారంభించి, అనంతరం కాలేజీ 22వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.