NLG: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చినారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో సభకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజా ఉద్యమాలు చేసేది కమ్యూనిస్టులే అన్నారు.
AKP: పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము డిమాండ్ చేశారు. ఎలమంచిలి డీసీసీబీ బ్రాంచ్ వద్ద పీఏసీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీవో 36ను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని సూచించారు.
AP: ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్కు నెయ్యిలో ఎలాంటి సంబంధం లేదని CM చంద్రబాబు అన్నారు. ‘ఇందాపూర్ డెయిరీ అనేక సంస్థలకు కో-మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. హెరిటేజ్ ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడదు. మీరు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి నాటకాలు చేస్తున్నారు. వాళ్లు తప్పు చేసి మళ్లీ మమ్మల్నే క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ల లీకేజీలకు మరమ్మతులు చేయించాలని స్థానిక కౌన్సిలర్ శనిగారపు చిన్నయ్య సూచించారు. మంగళవారం మున్సిపల్ అధికారులతో కలిసి వార్డులోని పలు కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు లీక్ అవుతున్నాయని, నీరు వృధాగా పోతుందన్నారు.
అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఇస్రో YUVIKA ప్రోగ్రామ్ను ప్రకటించింది. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్లో బేసిక్ నాలెడ్జ్ను పరిచయం చేయడం దీని ఉద్దేశం. 2026 JAN 1 నాటికి 9వ తరగతి చదువుతున్నవారు అర్హులు. FEB 27-మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆన్లైన్ క్విజ్ ద్వారా ఎంపిక చేస్తారు. వివరాలకు వెబ్సైట్: https://www.isro.gov.in/
అన్నమయ్య: మంగళవారం అసెంబ్లీలో RTC డిస్పెన్సరీలు, ఉద్యోగుల ఆరోగ్య పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 19 డిస్పెన్సరీలు, విజయవాడలో సెంట్రల్ ఆసుపత్రి ద్వారా 45 వేల RTC ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.EHS పథకం కింద 1,900 ఆసుపత్రుల్లో ఉద్యోగులు, వారి కుటుంబాలకు చికిత్స సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
JGL: నూకపల్లి నాక్ సెంటర్లో ఎండపల్లి, వెల్గటూర్, బుగారం, కొడిమ్యాల మండలాలకు చెందిన సర్పంచ్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. గ్రామాభివృద్ధి ప్రణాళికలు, పంచాయతీ రాజ్ చట్టాలు, నిధుల సమర్థ వినియోగం, గ్రామసభల నిర్వహణ, పారదర్శక పరిపాలన వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రముఖ మొబైల్ కంపెనీ ఐకూ.. ‘ఐకూ 15R’ పేరిట కొత్త ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 7,600mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్, 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 16, ఆరిజిన్ OS 6, IP68, IP69 రేటింగ్, వెనక వైపు 50MP+08MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 8GB+256GB వేరియంట్ ధరను రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది.
KRNL: గోనెగండ్ల మండలం గంజహళ్లిలో మహాత్మా బడే సాహెబ్ 332వ ఉరుసు మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని దర్గాను దర్శించుకున్నారు. పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముదుగోల్, మహబూబ్ బాషా సంప్రదాయబద్ధంగా శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు.
NDL: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 296 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా డీఐఈవో శంకర్ నాయక్ వెల్లడించారు. మొత్తం 14,424 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల కొందరు రాలేకపోయారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని వివరించారు.
MBNR: జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని చెరువులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు గల్లంతైన దుబ్బ నవీన్(30), ఎడ్ల యాదగిరి(24) ఆచూకీ ఇంకా లభించకపోవడంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలన్నారు. అలాగే మృతదేహాలు త్వరితగతిన లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
NRML: జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు మార్చి 18 వరకు, పది పరీక్షలు ఏప్రిల్ 16 వరకు 47 కేంద్రాలలో జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
SKLM: అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్ కు బడ్జెట్ లో నిధులు పెంచాలని కోరుతూ శ్రీకాకుళం ప్రాజెక్టు కార్యాలయం వద్ద మంగళవారం CITU టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశ రావు ఆధ్వర్యంలో రిలే దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసవేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయడం లేదని అన్నారు.
కృష్ణా: గుడివాడలో సోషల్ మీడియా, ఈవ్ టీకింగ్, మైనర్ డ్రైవింగ్ అంశాలపై ట్రాఫిక్ ఎస్సై నాగరాజు విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపకూడదని సూచించారు. సోషల్ మీడియా వేదికల్లో తమ వ్యక్తిగత సమాచారం, ఫోటోలను అప్లోడ్ చేయకూడదని తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
NTR: కంచికచర్ల మండల ప్రభుత్వ ఖాజీగా షేక్ అబ్దుల్ రషీద్ నియమితులైన్నారు. మంగళవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయనను ఘనంగా సత్కరించారు. మైనారిటీ సోదర సోదరీమణుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్క్ బోర్డ్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ కరిముల్లా, తదితరులు పాల్గొన్నారు.