• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తెలంగాణ తల్లి దేవతామూర్తితో సమానం: జగదీష్‌రెడ్డి

TG: కాంగ్రెస్ విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ నాయకత్వం దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో ఇదే రకంగా తెలంగాణ భాషను అవమానించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టుకొచ్చిందని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే దేవతామూర్తితో సమానమని పేర్కొన్నారు.

December 10, 2024 / 03:37 PM IST

రాజమండ్రిలో సందడి చేసిన సినీ నటి

EG: రాజమండ్రిలో సినీ నటి నిధి అగర్వాల్ మంగళవారం సందడి చేశారు. ఓ సిల్వర్ జ్యువలరీ షోరూమ్ కార్యక్రమానికి ఆమె హజరయ్యారు. కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. నిధి అగర్వాల్‌తో పాటు MLA ఆదిరెడ్డి వాసు, వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు

December 10, 2024 / 03:36 PM IST

ఎమ్మార్వో ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు

CTR: నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కూనమరాజుపాలెం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మండల ఎమ్మార్వో శేషగిరి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. సదస్సులో రైతులు ఇచ్చిన వినతులను పరిశీలించి రైతులకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

December 10, 2024 / 03:36 PM IST

1000 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ELR: కుక్కునూరు మండలం వేలేరు గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గ్రామంలోని పామిలేరు నది గట్టున సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే.శ్రీనుబాబు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై, సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.

December 10, 2024 / 03:35 PM IST

‘సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం అమలు చేయాలి’

ప్రకాశం: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం అమలు చేయాలని రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ఒంగోలుకు చెందిన రాయపాటి జగదీష్ కోరారు. మంగళవారం తాడేపల్లిలోని మంత్రి చాంబర్లో కలిశారు. కేంద్రం విటమిన్లతో కూడిన బియ్యాన్ని హాస్టల్స్‌కు అందిస్తుందని, సంక్షేమ హాస్టల్ అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

December 10, 2024 / 03:35 PM IST

వెల్దండలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం

NGKL: వెల్దండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ BRS పార్టీ ఆధ్వర్యంలో.. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు BRS పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు పుట్ట రాంరెడ్డి, యాదగిరి, శేఖర్, అశోక్, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 03:35 PM IST

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

SRD: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహరూపు రేఖలు మార్చడం సరికాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.

December 10, 2024 / 03:34 PM IST

కొడవలూరులో రెవెన్యూ సదస్సు కార్యక్రమం

NLR: కొడవలూరు మండలంలోని మానే గుంటపాడులో మంగళవారం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల దగ్గర నుంచి మండల రెవెన్యూ అధికారి స్ఫూర్తి అర్జీలను స్వీకరించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న రెవిన్యూ సమస్యలపై ఆరా తీశారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

December 10, 2024 / 03:34 PM IST

నారా లోకేశ్‌తో ఆర్మూర్ ఎమ్మెల్యే భేటీ

నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఇవాళ ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఇవాళ మంత్రి నారా లోకేశ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మంత్రి లోకేశ్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రితో కలిసి ఫోటో దిగారు. మంత్రి లోకేశ్‌ను కలవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఎమ్మెల్యే అన్నారు.

December 10, 2024 / 03:34 PM IST

కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు: షర్మిల

AP: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం వ్యాఖ్యలు మరోసారి ఏపీ ప్రజలను అవమానించనట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని చెప్పాడం సరికాదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ఏపీ ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకాని తనమని ధ్వజమెత్తారు. కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు.. విభజన చట్టంలోనే ఉందని స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసిందని ధ్వజమెత్తారు.

December 10, 2024 / 03:33 PM IST

బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

NLG: దేవరకొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ. 4500 కోట్లను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్డీఓకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 03:32 PM IST

‘మహిళా పోలీసు ఉద్యోగులు ఆరోగ్యంపై దృష్టి సారించాలి’

SRD: మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించి ఇంట్లో కుటుంబ పోషణ కూడా చూసుకోవడంతో ఒత్తిడికి గురవుతారని చెప్పారు. వీరికోసమే అవగాహన సదస్సు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

December 10, 2024 / 03:31 PM IST

‘మాలల మహా సభకు వేలాదిగా తరలి రావాలి’

కోనసీమ: గుంటూర్‌లో డిసెంబర్ 15వ తారీఖున జరిగే మాలల మహాసభకు రాజోలు నియోజకవర్గం నుండి మాలలు వేలాదిగా తరలిరావాలని దళిత ఐక్య వేదిక కన్వీనర్ ఇసుకుపట్ల రఘుబాబు పిలుపునిచ్చారు. మంగళవారం రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మాలల ఆత్మీయ సమ్మేళనం సభ రాజోలు జేఏసీ అధ్యక్షులు మట్టా సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సభకు అందరూ హాజరు కావాలన్నారు.

December 10, 2024 / 03:31 PM IST

ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సైలెన్సర్ల ధ్వంసం

HNK: జిల్లా కేంద్రంలోని అదాలత్ సెంటర్‌లో నేడు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు. వరంగల్ నగరంలో ఇటీవల కాలంలో పోలీసులు పట్టుకున్న సైలెన్సర్లను సీపీ అంబర్ కిషోర్ ఝ ఆదేశం మేరకు రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించారు. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సైలెన్సర్లను నాశనం చేశారు.

December 10, 2024 / 03:30 PM IST

ఘోరం.. గొడ్డళ్లతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ

NLG: భూవివాదంతో సోదరుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ఘటన తిప్పర్తి మండలంలో జరిగింది. మండలంలోని మామిడాలకి చెందిన గజ్జి లింగయ్య, చంద్రయ్య అన్నదమ్ములు. ఇరువురి కుటుంబాల మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ రోజు లింగయ్య, చంద్రయ్య కుమారులు గొడ్డలితో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

December 10, 2024 / 03:30 PM IST