‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గబ్బర్ సింగ్’ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్తో యాడ్స్ చేయించడానికి కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టి.. రూ.కోట్లు ఆఫర్ చేశాయని తెలిపాడు. అయితే, ఆ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిది కావనే ఉద్దేశంతో పవన్ వాటిని తిరస్కరించారని చెప్పాడు.
మార్కాపురం బాయ్స్ హై స్కూల్లో ఆదివారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమ వ్యవస్థాపకులు లార్డ్ బాడెన్ పావెల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తిని, సేవా భావాన్ని అలవర్చుకోవాలని హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 30మంది లబ్ధిదారులకు రూ. 41,61,456లను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
నారాయణపేట పట్టణంలోని వీర సావర్కర్ చౌరస్తాలో ఆదివారం వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించినట్లు ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి వాహనదారుడి బాధ్యత అని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని చెప్పారు. అలాగే యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదన్నారు.
SRD : అమీన్ పూర్ డివిజన్ గండిగూడెం కాలనీలో నూతన శివ పంచాయతం రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
MDK: శివంపేట మండలం గుండ్లపల్లిలో ఆదివారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులను అభినందించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ASR: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని స్థానిక ఎస్సై ఎల్.సురేష్ సూచించారు. మండలంలోని తూటంగి గ్రామ పంచాయతీ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా వంటి అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తెలిపారు.
NZB: మోపాల్ మండలం కులాస్పూర్ సర్పంచ్ గుడి జనార్దన్రెడ్డి నిజామాబాద్ రూరల్ MLA రేకులపల్లి డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగా రెడ్డి, తాడేం సర్పంచ్ జలేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
PDPL: మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్డ్యాం గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలతో పూర్తిగా కప్పుకుపోయింది. ఇరువైపులా భారీగా పెరగడంతో నిల్వ నీరు తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. గుర్రపుడెక్క అధికంగా నీటిని పీల్చుకోవడంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం మొక్కలను తొలగించి చెక్డ్యాం పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
VSP: అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ క్రికెటర్ శేఖర్కి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన రూ.3 లక్షల చెక్కును గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అందజేశారు. ఈ దందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
BHPL: మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి రమేష్ ఆధ్వర్యంలో GP సిబ్బంది డ్రైనేజ్ కాలువలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో మంచినీటి సరఫరాకు ఆటంకం కలగకుండా పైప్లైన్ లీకేజీ మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు.
అన్నమయ్య: వీరబల్లి మండలం దిగువరాచపల్లెలో ఆదివారం టీడీపీ పార్టీ గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు నాయకత్వంతోనే పేదల ఆర్థిక ఉన్నతి,రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
JGL: రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన కట్ట గంగన్న ఇటీవల సౌదీ దేశంలో మరణించాడు. విషయం తెలుసుకున్న సౌదీ అల్లీపూర్ సంఘం సభ్యులు ఆదివారం అందరు కలిసి గంగన్న భార్యకు రూ. 1,36,830 ఆర్థిక సహాయం అందించారు. గంగన్న కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్థులు అభినందించారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం, సాలూరు పట్టణ కేంద్రాలలోడాగ్ స్క్వాడ్, బి.డి టీం సిబ్బందితో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వస్తువులను నిశితంగా పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంతో పాటు, ఎలాంటి సంఘ విద్రోహ ఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టారు.
BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికలలో మున్నూరు కాపు కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ ఆదివారం పాల్గొన్నారు. రానున్న కాలంలో అన్ని కులాలు, మతాలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వారితోపాటు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ జూపల్లి రమేష్ పాల్గొన్నారు.