• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ గంగాదేవి రథోత్సవం

KRNL: పెద్దకడబూరు మండలంలోని బాపురంలో వెలసిన శ్రీ గంగాదేవి రథోత్సవం ఆదివారం అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగింది. ఉదయం అమ్మవారికి బాపురం క్షేత్ర పీఠాధిపతులు శ్రీ బసలింగమ్మ అవ్వ ఆధ్వర్యంలో ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తెచ్చి రథంపై ప్రతిష్టించి రథోత్సవం నిర్వహించారు.

February 22, 2026 / 08:16 PM IST

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం

AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిబిరంలో 240 మంది రోగులు చికిత్సలు చేయించుకోగా వారిలో 26 మందికి ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులతో పాటు కళ్లద్దాలు అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు.

February 22, 2026 / 08:16 PM IST

బంగారు తంబళ్లపల్లె లక్ష్యంగా జనసేన దృష్టి

అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని ‘బంగారు తంబళ్లపల్లె’గా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ బి. హరిప్రసాద్‌ అన్నారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను తంబళ్లపల్లెకు రప్పిస్తామని తెలిపారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

February 22, 2026 / 08:16 PM IST

IND vs SA: బ్రెవిస్, మిల్లర్ మెరుపులు

20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికా జట్టును బ్రెవిస్, మిల్లర్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 50 బంతుల్లోనే 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న బ్రెవిస్ (45)ను దూబే పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం మిల్లర్ (52*)కు తోడుగా స్టబ్స్ (1*) క్రీజులో ఉన్నాడు. SA స్కోరు 13 ఓవర్లలో 128/4.

February 22, 2026 / 08:14 PM IST

మాతృభూమి సేవకు శాంతి కుమార్ పిలుపు

MBNR: ప్రతి ఒక్కరూ మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతి కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించాలని, దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 08:11 PM IST

స్వామివారిని ఎంత మంది దర్శించుకున్నారంటే..?

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామివారిని 47,280 ఈవో రమాదేవి తెలిపారు. స్వామివారికి 2906 కోడె మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు.

February 22, 2026 / 08:11 PM IST

ఉద్యోగాలు.. ఏడాదికి రూ.8 లక్షల జీతం

TG: హైదరాబాద్‌లోని Wolves4You Private Limited సంస్థ బిజినెస్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.8,40,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది. మార్చి 22 లోపు దరఖాస్తు చేసుకోండి.

February 22, 2026 / 08:10 PM IST

కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం

ELR: ఆదివారం పెదవేగి మండలం విజయరాయి గాంధీ నగర్ లోని సీతారామ కళ్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఆదివారం జరిగింది. వారం రోజుల్లోగా కోకో గింజల ధరల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

February 22, 2026 / 08:10 PM IST

ఫైబర్ నెట్ సేవలను విస్తరిస్తాం: చంద్రబాబు

AP: 4G, 5Gతో కోట్ల మందికి డిజిటల్ సేవలు అందుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. భారత్‌లో డేటా ఖర్చు ప్రపంచంలోనే అతి తక్కువ అని తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలను విస్తరిస్తామని చెప్పారు. 970 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.

February 22, 2026 / 08:10 PM IST

రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ

MDK: టేక్మాల్‌లోని రైతు వేదిక వద్ద ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు పనిముట్లను పంపిణీ చేశారు. పేట డివిజన్ పరిధిలోని టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గ్ మండలాలకు చెందిన రైతులు ఈ సదుపాయాన్ని పొందారు. అధికారులు మాట్లాడుతూ.. ఆధునిక సాగుకు యంత్రాలు ఎంతో అవసరమని, ఆసక్తి గల రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 08:05 PM IST

“అకాల వర్షం.. రైతులకు నష్టం”

MHBD: జిల్లా కేంద్రంలోని పలు మండలాలలో ఇవాళ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో బయ్యారం మండలం బీరోనిమాడువల గ్రామంలో గాలివానతో రైతుల మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు తమను నష్టపరిచాయని, నష్టపోయిన పంటకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

February 22, 2026 / 08:03 PM IST

కల్తీ నెయ్యిపై శాసనసభలో చర్చించే యోచనలో సర్కార్!

AP: కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో వచ్చే వారంలో ఒకరోజు చర్చించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు సర్కార్ చెప్పాలనుకుంటుంది. ముందు శాసనసభలో చర్చించి తర్వాత మండలిలోనూ చర్చించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

February 22, 2026 / 08:02 PM IST

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన

VSP: ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. సమ్మిట్ జరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇందులో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు పివిఎన్.మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.

February 22, 2026 / 08:00 PM IST

శిక్షణ కేంద్రంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NRML: వికారాబాద్ అనంతగిరిలో తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల శిక్షణ కేంద్రం లో రెండవ రోజు శిక్షణ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. పది రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో నాయకత్వ, నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.

February 22, 2026 / 07:59 PM IST

ఆజాద్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 69వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. చిత్రాలయ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలందించారని కొనియాడారు.

February 22, 2026 / 07:59 PM IST