NRML: తానూర్ మండలం ఎల్వికి చెందిన ఓ మైనర్ బాలికకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ లింగమూర్తి, ఎస్ఐ రమేష్, చైన్డ్ లైన్ అధికారులు మంగళవారం గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సంవత్సరాలలోపు వయసున్న అమ్మాయికి పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని పెళ్లిని వాయిదా వేయించారు.
భారత ఆటోమొబైల్ పరిశ్రమ రానున్న ఐదేళ్లలో అంతర్జాతీయంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగం గత పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 కోట్లకు వృద్ధి చెందినట్లు వెల్లడించారు. ప్రఖ్యాత గ్లోబల్ ఆటోమొబైల్ బ్రాండ్లు భారతదేశంలో ఉండటం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు.
PDPL: కేంద్రాలలో తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ డి వేణు మంథని మండలంలోని పవర్ హౌస్ కాలనీ, అంగళూరు, గుంజ పడుగు, నాగారం గ్రామాలు, రామగిరి మండలంలో సుందిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
PPM: అన్నదాతకు అండగా వైసీపీ ఉంటుందని పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రైతన్నలను దగా చేస్తున్న కూటమి సర్కార్ పై నిరసనగా గళం విప్పేందుకు వైసీపీ సిద్ధమైందన్నారు. ఈనెల 13వ తేదీన భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్కి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.
ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదన్నారు. 12 నెలల కాలంలో ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ప్రకాశం: బల్లికురవ మండలంలోని రెవెన్యూ విలేజ్ అయినటువంటి కొనిదెన గ్రామంలో రెవెన్యూ శాఖ అధికారులు మంగళవారం రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం రెవెన్యూ పరిధిలో దాదాపుగా 100 అర్జీలను స్వీకరించినట్లుగా అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
SRCL: ఈ నెల 31లోపు వ్యవసాయ గణన పూర్తి చేస్తామని ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసచారి అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31 లోపు ఈ వ్యవసాయ గణన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.
TG: జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీడియాపై నటుడు మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులపై మైక్ తీసుకోని దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే మోహన్ బాబుతో మనోజ్ వాగ్వాదానికి దిగాడు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
AP: కేంద్ర మంత్రులకు పెమ్మసాని చంద్రశేఖర్ లేఖ రాశారు. గుంటూరు జిల్లా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. స్పైసెస్ బోర్డు ఆఫ్ ఇండియాలో మిర్చి విభాగం ఏర్పాటు, కనీస మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్లను పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గానికి నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎంపీ డీకే అరుణకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి దేవరకద్రలో విలేకరులతో మాట్లాడుతూ.. దేవరకద్రలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని ఈ దిశగా ఎంపీ ఆలోచించి దేవరకద్రకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని కోరారు.
కామారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖల అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
KNR: హుస్నాబాద్లో ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాన్ని, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆవిష్కరించారు. హుస్నాబాద్ పట్టణంలోని కాలనీనకుండా ఆయన పర్యటించారు. ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
TG: జల్పల్లిలోని ఫామ్హౌస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మంచు మనోజ్ దంపతులు మోహన్ బాబు ఇంటికి వెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే మనోజ్ను గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో గేట్లు తోసుకొని మనోజ్ లోపలికి వెళ్లాడు.
ప్రకాశం: పంగులూరు మండలంలోని మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 38 అర్జీలు వచ్చినట్లు పంగులూరు మండల తహసీల్దార్ సింగారావు తెలిపారు. ముప్పవరం 23, జాగర్లమూడి వారి పాలెం 15 ఇలా మొత్తం 38 అర్జీలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై ఆరా తీశారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
TG: ఎమ్మెల్యేల ఓరియంటేషన్ సెషన్ను బీఆర్ఎస్ నేతలు బహిష్కరించారు. తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని ఆరోపించారు. తెలంగాణ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్ను బీఆర్ఎస్ నేతలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.