• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జడ్పీహెచ్ఎస్‌లో మెగా హెల్త్ క్యాంప్

VKB: వికారాబాద్ 16 వార్డులో ఉన్న జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపును మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం అనన్య, జిల్లా విద్యాధికారి రేణుక దేవితో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు ఇలాంటి ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:45 PM IST

భవిషత్తులు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం: ఎమ్మెల్యే

BDK: భద్రాచలం పట్టణంలోని ఏడు పదకుండు అవార్డులో అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు శంకుస్థాపన చేశారు. వారితోపాటు సర్పంచ్ కృష్ణ ఉపసర్పంచ్ కవిత పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.

February 28, 2026 / 04:45 PM IST

పేలుడు ఘటన.. తల్లి ఎక్కడంటూ కుమార్తెల రోదన

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, తమ తల్లి నూకళ్ల దేవి కనిపించడం లేదంటూ సంఘటనా స్థలం వద్ద ఆమె ఇద్దరు కుమార్తెలు రోదిస్తున్నారు. వారు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. కాగా, ఈ ఘటనలో 21మంది మృతి చెందారు.

February 28, 2026 / 04:44 PM IST

మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది: MP

HNK: ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో VO. భవన నిర్మాణ పనులకు స్థానిక ఎంపీ కడియం కావ్య భూమి పూజ చేశారు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. అనంతరం స్థానికులతో ఎంపీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 04:44 PM IST

మహిళలకు అధికంగా వచ్చే క్యాన్సర్లు ఇవే..!

HYD: తెలంగాణలో ప్రతి ఏటా సుమారు 55 నుంచి 60 వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. మహిళల్లో కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లో రెండో స్థానంలో ఉందని, రాష్ట్రంలో ఏటా దాదాపు 3,200 మందిని ప్రభావితం చేస్తున్నట్లు HYD MNJ క్యాన్సర్ హాస్పిటల్ టీం తెలిపింది. ఈ నేపధ్యంలోనే HPV వాక్సినేషన్ ప్రారంభించారు. అయితే, మొదటి స్థానంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది.

February 28, 2026 / 04:44 PM IST

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు: ఛైర్పర్సన్

WGL: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నర్సంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ అన్నారు. 5వ వార్డులో స్థానిక నేతలతో కలిసి ఛైర్పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట పట్టణ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు.

February 28, 2026 / 04:43 PM IST

పదో తరగతి విద్యార్థులు సమయాన్ని వృధా చేయవద్దు: దేవా

WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం HM వసంత ఆధ్వర్యంలో ‘స్ఫూర్తి’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య ముఖ్యఅతిథిగా రిటైర్డ్ MEO దేవా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు మత్తు పానీయాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా సమయాన్ని వృథా చేయకూడదన్నారు.

February 28, 2026 / 04:41 PM IST

భవనంపై నుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య

KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని SRNK డిగ్రీ కళాశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ అహమ్మద్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

February 28, 2026 / 04:40 PM IST

రూ.30 లక్షలతో సీసీ రోడ్లకు భూమిపూజ

KRNL: కూటమి ప్రభుత్వంలో పెద్దకడబూరు మండలంలో ఎన్నడు చూడని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని పెద్దకడబూరు TDP, జనసేన మండల అధ్యక్షులు మల్లికార్జున, బజారి అన్నారు. హెచ్. మురవనిలో రూ.30లక్షలతో సీసీ రహదారుల నిర్మాణం కోసం ఇవాళ భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తే.. కూటమి ప్రభుత్వం గ్రామల అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తుందన్నారు.

February 28, 2026 / 04:40 PM IST

మద్యం మత్తులో గొడవ.. లారీ డ్రైవర్ ఆత్మహత్య

KDP: సిద్ధవటం(మం) మాధవరం ఎస్కేఆర్ నగర్‌లో లారీ డ్రైవర్ కోటపాటి బాబు రాజు(48) మద్యం మత్తులో భార్యతో గొడవ తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉండగా, కుటుంబంలో విషాదం నెలకొంది.

February 28, 2026 / 04:40 PM IST

హరీష్ రావు ధనదాహం తీరలేదా?: అద్దంకి

TG: జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నలకు మాజీమంత్రి హరీష్ రావు సమాధానం చెప్పడం లేదని MLC అద్దంకి దయాకర్ అన్నారు. ‘గత ప్రభుత్వంలో శారదా పీఠానికి 2 ఎకారాల భూమి ఇచ్చారు. భూమిని రద్దు చేయడాన్ని శారద పీఠం ఒప్పుకుంది. ఇంకెంత దోచుకుంటే హరీష్ రావు ధనదాహం తీరుతుందో. నిజాలు తెలుసుకోకుండా విపక్ష నేతలు మాట్లాడడం సరికాదు. సనాతన ధర్మాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీనే’ అని పేర్కొన్నారు.

February 28, 2026 / 04:40 PM IST

కాకినాడ పేలుడుపై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై గవర్నర్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

February 28, 2026 / 04:38 PM IST

ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ అజేయ రికార్డు

T20 WCలో వెస్టిండీస్ జట్టుకు ఈడెన్ గార్డెన్స్‌లో అజేయ రికార్డు ఉంది. ఇదే వేదికపై జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి వెస్టిండీస్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తంగా T20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ స్టేడియంలో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ విండీస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.

February 28, 2026 / 04:38 PM IST

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ATP: బొమ్మణహల్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

February 28, 2026 / 04:36 PM IST

సచివాలయం సిబ్బందికి ఎమ్మెల్యే హెచ్చరిక

NLR: కందుకూరులోని శ్రీరామనగర్ కాలనీ స్వర్ణ వార్డు సచివాలయం-9ను ఎమ్మెల్యే నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించబోమని, ఫిర్యాదులు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:35 PM IST