• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు చేతుల శుభ్రత పై అవగాహన

JGL: పెగడపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం చిన్నారులకు చేతుల శుభ్రతపై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించారు. అన్నం తినే ముందు, తిన్న తర్వాత చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో చిన్నారులకు చూపిస్తూ,అవగాహన కల్పించారు. మండల ఐసిడిఎస్ సూపర్వైజర్లు మహేశ్వరి,సుభద్ర మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు విద్యతో పాటు పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తున్నారు.

February 28, 2026 / 08:46 AM IST

కాచి చల్లార్చిన నీటిని తాగాలి: కమిషనర్

WG: పట్టణ ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ ఆఫీసులో వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. పైప్ లైన్ లీకేజీలను గుర్తించి, సరి చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి పైపుల నుంచి నీటి నాణ్యతను సేకరిస్తామన్నారు.

February 28, 2026 / 08:46 AM IST

‘మార్చి 15 లోగా పన్నులు చెల్లించండి’

KRNL: గోనెగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి, కొళాయి, వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించి, గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని పంచాయతీ సెక్రెటరీ సతీశ్ ఇవాళ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో పన్ను చెల్లింపులు చేపడుతుందన్నారు. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మార్చి 15 లోపు పన్నులు చెల్లించి, పంచాయతీకి సహకరించాలన్నారు.

February 28, 2026 / 08:44 AM IST

కలెక్టర్‌కు వాటర్ సప్లై యూనియన్ వినతి

ATP: సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింతకాయల నరేష్ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, వీలైనంత త్వరగా బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 08:44 AM IST

రహదారి భద్రతను డ్రైవర్ల ఆరోగ్యం కీలకం: CI

HNK: DGP పిలుపునిచ్చిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 45 మంది డ్రైవర్లకు CI పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కాజీపేట నవ దృష్టి ఆసుపత్రిలో డాక్టర్ లీలా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచిత అద్దాలు, మందులు అందజేశారు. రహదారి భద్రతలో డ్రైవర్ల ఆరోగ్యం కీలకమని అన్నారు.

February 28, 2026 / 08:44 AM IST

మోదుమూడిలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం అవనిగడ్డ మండలం మోదుమూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఒకటో తేదీ ఆదివారం వచ్చే ప్రతి నెలా ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్లు సొమ్ము పంపిణీ చేయిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచిందన్నారు.

February 28, 2026 / 08:42 AM IST

ఓటీటీలోకి విజయ్, అరవింద్ స్వామి మూవీ

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ నటించిన సైలెంట్ మూవీ ‘గాంధీ టాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. JAN 30న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. వెండితెరపై మూకీ చిత్రాల యుగం ఎప్పుడో ముగిసింది. ఇలాంటి తరుణంలో ‘గాంధీ టాక్స్‌’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని దర్శకుడు కిశోర్‌ తెరకెక్కించారు. ఇందులో ఒక్క డైలాగ్‌ కూడా వినిపించదు.

February 28, 2026 / 08:42 AM IST

సిద్ధవటంలో చిరుత సంచారం..!

KDP: సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.

February 28, 2026 / 08:41 AM IST

కిక్ బాక్సింగ్ విజేతకు నటుడి అభినందనలు

కోనసీమ: అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించిన రామచంద్రపురానికి చెందిన కారుమూరి లేఖా నిహారికను నటుడు శివాజీరాజా అభినందించారు. శుక్రవారం రాజమండ్రిలో ప్రశంసించారు. మార్చి 4 నుంచి బెంగళూరులో జరగనున్న సౌత్ జోన్ పోటీల్లోనూ నిహారిక తన ప్రతిభను చాటి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

February 28, 2026 / 08:40 AM IST

నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్

HYD: మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని గచ్చిబౌలి ఏఈ భాస్కర్ తెలిపారు. నానక్రాంగూడ, అలేఖ్య హోమ్స్, విజయకృష్ణ బిల్డింగ్, డోమినోస్ ఏరియా, గోల్ఫ్ వ్యూ, ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.

February 28, 2026 / 08:40 AM IST

నేడు మేడారానికి మంత్రి పొంగులేటి.. రాత్రి ఇక్కడే బస!

MLG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం (నేడు) మేడారం సందర్శనకు వస్తున్నారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మేడారం మాస్టర్ ప్లాన్ అమలు, పెండింగ్ పనుల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక్కడి హరిత హోటల్లో రాత్రి బస చేస్తారు. ఆదివారం మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు.

February 28, 2026 / 08:40 AM IST

SVU పీజీ 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

TPT: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించిన పీజీ రెండవ సెమిస్టర్ M.Sc బోటనీ/ బయో కెమిస్ట్రీ/ జాగ్రఫీ/ఫిజిక్స్ /మ్యాథమెటిక్స్ / అప్లైడ్ మ్యాథమెటిక్స్ /స్టాటిస్టిక్స్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు డీన్ సురేంద్రబాబు పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించించారు.

February 28, 2026 / 08:37 AM IST

విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించిన కలెక్టర్

MNCL: కాసిపేట మండల కేంద్రంలోని KGBV ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించి వారి విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం వంటశాలను పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎస్ఓ సరితను ఆదేశించారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు గదుల పనులు పరిశీలించారు.

February 28, 2026 / 08:34 AM IST

రేపే జూలో చిత్రలేఖనం పోటీలు

VSP: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా రేపు జూలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు క్యూరేటర్ జీ.మంగమ్మ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూ బయోస్కోప్ వద్ద పోటీలు జరుగుతాయి. 1–5, 6–10 తరగతులు, ఇంటర్ నుంచి పీజీ వరకు మూడు విభాగాల్లో విద్యార్థులు పాల్గొనవచ్చు. వివరాలకు 94411 56344 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

February 28, 2026 / 08:33 AM IST

తెనాలి పంట కాలువలో మృతదేహం లభ్యం

GNTR: తెనాలి మండలం కంచర్లపాలెం శివారులోని పంట కాల్వలో సుమారు 50ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి,ప్రాథమిక విచారణలో మృతుడు యాచకుడిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు.

February 28, 2026 / 08:32 AM IST