NRML: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఉప ఆలయాలను కూడా మూసివేస్తామన్నారు. మంగళవారం తెల్లవారుజామునే అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు, నివేదనలు పూర్తి చేసి, ఉదయం 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు.
SRCL: వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వరద కాల్వకు అధికారులు రాంపూర్ పంపు హౌస్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రెండవ, మూడవ మోటార్లు ఆన్ చేసి వరద కాల్వకు నీటిని విడుదల చేశారు. కాగా నిన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వేములవాడ నియోజకవర్గనికి నీటిని విడుదల చేయాలని కోరారు. వెంటనే మంత్రి నీటిని విడుదల చేయవలసిందిగా ఆదేశించారు.
JGL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. 36 ఏళ్లపాటు పోలీస్ శాఖలో నిబద్ధతతో సేవలందించిన ఏఎస్ఐ బిక్షపతి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడుతూ.. శాఖకు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలన్నారు.
JGL: జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం డైరీని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీతతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీవోస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ట్రెజరర్ ఎండీ సాజిద్ బాబా, సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్,సెక్రటరీ ఉన్నారు.
KNR: తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. కరీంనగర్లో మాట్లాడుతూ.. విద్యార్థి సంఘాల అభిప్రాయం తీసుకోకుండా నివేదిక ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం సరికాదన్నారు. బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని అన్నారు.
SRPT: అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ వీరభద్రమ్మ కోరారు. విన్నుత న్యూరో, గ్రామపంచాయతీ సహకారంతో ఏర్పాటుచేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన విన్నుత న్యూరో ఆస్పత్రి నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో అంతర్జాతీయ శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తంచేసింది. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించి శాంతియుతంగా వివాదాలు పరిష్కరించుకోవాలని సూచించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిసైల్ దాడులు చేస్తుండగా.. వాటిని అమెరికా, UK ఫైటర్ జెట్స్ అడ్డుకుంటున్నాయి. మరోవైపు సెంట్రల్ ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 30% ముడిచమురుకు రవాణాకు మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. బలసంధిలో ఉన్న నౌకలనూ నిలిపివేసింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారత్, చైనాకు ఇది నష్టం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేట్లపాలెం పేలుడు ఘటన బాధితులను పరామర్శించారు. ఈ మేరకు కాకినాడ GGHకి వెళ్లిన ఆయన.. క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యలుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
➢ 1901: ఆంధ్రరాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం➢ 1918: తెలుగు రంగస్థల నటీమణి ఆవేటి పూర్ణిమ జననం➢ 1951: బీహార్ సీఎం నితీష్ కుమార్ జననం➢ 1986: తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు➢ 1997: స్వాతంత్ర్య సమరయోధుడు యలమంచిలి వెంకటప్పయ్య మరణం➢ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
శ్రీలంకతో సూపర్ 8 మ్యాచులో పాక్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే సెమీస్కు అర్హత సాధించేందుకు ప్రత్యర్థిని 147 పరుగులకే కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్లగా.. ఇందులో పాక్ సాధించిన విజయం వృథా అయింది. ఇక 213 రన్స్ లక్ష్యఛేదనలో లంక తరఫున రథ్నాయకే 58, కెప్టెన్ శనక 76* పరుగుల పోరాటం ఫలించలేదు.
KRNL: వేరుశనగ పంట పాసింగ్(గ్రేడింగ్) విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని శనివారం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గోవింద్కు వినతిపత్రం అందజేసి, గతంలో రద్దైన విధానాన్ని వ్యాపారస్తులు తిరిగి అమలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని తెలిపారు.
T20 WC నుంచి పాక్ ఎలిమినేట్ అయింది. శ్రీలంకతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్లో ప్రత్యర్థిని 147 రన్స్ లోపు కట్టడి చేయాల్సి ఉండగా.. పాక్ అలా చేయలేకపోయింది. దీంతో మెరుగైన రన్రేట్ ద్వారా గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్ సెమీస్కు అర్హత సాధించింది. ప్రస్తుత మ్యాచ్లో పాక్ గెలిచినా వృథానే కాగా.. 16 ఓవర్లలో ఆట ముగిసేసరికి లంక స్కోర్ 150/5.
CTR: కార్వేటి నగరం మండలం అన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. కార్వేటి నగరం నుంచి పల్లిపట్టు వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ను అదుపుతప్పి ఢీకొంది. ప్రమాదంలో కృష్ణసముద్రం గ్రామానికి చెందిన యేసుమలై అక్కడికక్కడే మృతిచెందగా, ప్రేమ్ కుమార్కు తీవ్ర గాయాలు అయ్యాయి.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా రేపు ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత అమ్మాయిల జట్టు మూడో వన్డేలో తలపడనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ ఆసీస్ సొంతం కాగా.. వైట్ వాష్ నుంచి తప్పించుకునేందుకు మూడో వన్డేలోనైనా విజయం సాధించాలని హర్మన్ సేన భావిస్తోంది. ఈ సిరీస్ అనంతరం ఇరుజట్లు మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్లో ఢీకొంటాయి.