GDWL: ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ -2 పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు మంగళవారం సూచించారు. 2 పరీక్షలు 2 రోజులపాటు 4 దఫాలుగా నిర్వహిస్తామన్నారు. ఉదయం 10:00 నుంచి 12:30 వరకు మధ్యాహ్నం 3:00 నుంచి 5: 30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలన్నారు.