సంగారెడ్డి: 2024 నవంబర్లో కుల గణన సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే విడుదల చేయాలని సిర్గాపూర్ PRTU మండల శాఖ ఆధ్వర్యంలో MPDO ఆఫీసులో సూపరింటెండెంట్కు శనివారం వినతి పత్రం అందించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలని మండల శాఖ అధ్యక్షులు కర్ర నర్సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
వనపర్తి పట్టణం 9వ వార్డు కలెక్టర్ ఆఫీస్ రోడ్డులో పాడైన మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతు చేసి నీళ్లు ఇవ్వాలని బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కుమార్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. డ్రైనేజీల నిర్మాణం సందర్భంగా ఏడాది క్రితం పైప్ లైన్ పగిలిపోయి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పైప్ లైన్ మరమ్మత్తు చేసి తాగునీరు అందించాలని కోరారు.
VSP: జిల్లాలో జర్నలిస్టులకు 2026–27 సంవత్సరానికి మంజూరైన మీడియా అక్రిడిటేషన్ కార్డులు పంపిణీకి సిద్ధమయ్యాయి. కార్డులు ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని వెల్లడించారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సు పాసుల జారీ కూడా మార్చి 2 నుంచి పొందవచ్చు.
SKLM: మందస మండల పరిధిలో ఉన్న గోపాల సాగర అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు గోపాల సాగర పరిసరాలను శనివారం పరిశీలించారు. పట్టణ ప్రజలు సేద తీరేందుకు పార్క్తో పాటు పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లకు నిధులు వినియోగిస్తామని తెలిపారు.
AKP: మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం మాడుగుల మండలం ఎం.కోడూరులో సమావేశం నిర్వహించారు. గ్రామ సమస్యలను పరిశీలించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, బస్సులు ఆగే ఏర్పాట్లు, అసంపూర్తి కుళాయి పనులు పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు అందరికీ వెనుకబడిన తరగతుల కులాలకు సంబంధించి వారికి ఉన్న హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ బక్క స్వరూప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
NTR: కొత్తనాగులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
NLG: జిల్లాలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్లకు సర్పంచులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవరకొండ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ.. SSR రేట్లను పెంచాలని కోరారు. గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచాలన్నారు.
AP: కాకినాడ జిల్లా పేలుడు ఘటనలో ఇప్పటివరకు 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేష్, గొడతా రాము, గొడతా నానిగా గుర్తించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిమితికి మించి బాణాసంచా తయారుచేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
KNR: స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ కే.రామకృష్ణ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన “50 సంవత్సరాల అత్యవసర పరిస్థితి-నేర్చుకోవలసిన పాఠాలు” అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 జిల్లాస్థాయి ఉపన్యాస ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న KNR మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో యువత పాత్ర కీలకమన్నారు.
JN: చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాన్ని నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కడియం కావ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిల్పూర్ గుట్ట ఆలయం ప్రాంత ప్రజలకే కాకుండా పరిసర జిల్లాల భక్తులకు కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని, ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానన్నారు.
ELR: ఉంగుటూరు మండలంలో ఇంటి పన్ను, కుళాయి పన్నులు వసూళ్లను పంచాయితీ అభివృద్ధి అధికారులు వేగవంతమయ్యాయని డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు అన్నారు. శనివారం ఆయన ఉంగుటూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వసూలు చేస్తున్న ఇంటి పన్ను, కుళాయి పన్నును పరిశీలించారు. ఇంటి పనులను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.
PDPL: గోదావరిఖని పట్టణం 8వ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం భాగ్యలక్ష్మి- తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో BRS పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. రామగుండం MLA రాజ్ ఠాకూర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
KMM: కనీస కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని పేర్కొన్నారు.
HNK: శాయంపేట రైతు వేదికలో పలు గ్రామాల వార్డు మెంబర్లకు 24వ తేదీ నుండి నేటి వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు మెంబర్ల పాత్ర, ఇతర అంశాలపై ఐదు రోజులపాటు వార్డ్ మెంబర్లకు అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు మెంబర్లకు నేడు మండల అధికారులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.