కామారెడ్డి: బాన్సువాడ ఉద్యమకారులకు ప్రకటించిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని బాన్సువాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక ఆర్అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆగ్రో చైర్మన్ మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ ఉన్నారు.