TG: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులు బీఆర్ఎస్ బహిష్కరించనుంది. రేపటి నుంచి జరగనున్న అవగాహన తరగతులు బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మాజీమంత్రి కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. తమ హక్కులకు స్పీకర్ భంగం కలిగేలా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. తొలిరోజే తమ ఎమ్మెల్యేలను లోపలికి రాకుండా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.