కృష్ణా: నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద క్షిపణి పరీక్ష కేంద్రంలోని పలు పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన వాటిలో మొట్టమొదటిది కృష్ణా జిల్లాలోని గుల్లలమోద వద్ద క్షిపణి పరీక్ష కేంద్రం కావడం విశేషం. ఇది కృష్ణా జిల్లాకు మణిహారంగా మారునుంది. ఎట్టికేలకు ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడింది.