TPT: తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ జాతర ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లను నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, మేయర్ శిరీష శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు.