KDP: కలసపాడు మండలంలోని ముదిరెడ్డిపల్లిలో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీశ్ రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి నూతన బోరు వేసి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండాకాలం సంభవిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు.