కృష్ణా: ఇద్దరు పాత నేరస్థులను శనివారం TGకి చెందిన సత్తుపల్లి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండకు తరలించారు. సత్తుపల్లి సీఐ టీ. కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన దేవరకొండ రాంబాబు, చిలకలూరిపేటకు చెందిన బొమ్మల విజయ్ జైలుశిక్ష అనుభవిస్తూ బయటకు వచ్చాక పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారు. వాహనాల తనిఖీలలో పారిపోతుండగా పట్టుకొని అరెస్ట్ చేశారు.