KKD: పిఠాపురం బార్ అసోసియేషన్ ఎన్నికలు మే 9న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి బత్తిన లక్ష్మణదొర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 5న నామినేషన్ల స్వీకరణ, 6న పరిశీలన, 7న ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు. మే 9న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సంప్రదించాల న్నారు.